Mallikarjun Kharge : ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైంది.. ఎప్పుడైనా పడిపోతది.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు
- మోడీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు
- దేశానికి మంచి జరగాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం
Mallikarjun Kharge :కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని అది ఎప్పుడైనా పడిపోవచ్చని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 240 సీట్లు వచ్చాయి. ఇది మెజారిటీకి అవసరమైన 272 కంటే తక్కువ. అయితే ఎన్నికలకు ముందు ఏర్పాటైన ఎన్డీయేకు పూర్తి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కేంద్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది.
Read Also:Gold Price Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై రూ.660 పెరిగింది!
Also Read
- Mutual Funds: ఓ వైపు స్టాక్ మార్కెట్ పడిపోతున్నా.. విపరీతంగా పెరుగుతున్న SIP ఖాతాలు..
- Raghav Chadha: ఆప్కు రాఘవ్ చద్దా భారీ షాక్.. ఏకంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి..
- Royal Enfieldకు పోటీగా Yezdi Scrambler 350.. ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే!
- Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..
అయితే ఈ సారి ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైంది.. మోడీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ రాలేదు.. ఇది మైనారిటీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు.. కానీ, మేము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదు. దేశ ప్రజలకు మంచి జరగడం కోసం మేము ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశాన్ని పటిష్టం చేయడానికి మనం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, ప్రధాని మోడీ మాత్రం దేశానికి మంచి జరుగుతుందంటే.. అది జరగనివ్వకుండా చేయడం ఆయనకు అలవాటని విమర్శించారు. కానీ, ఇండియా కూటమి మాత్రం పరస్పరం సహకరించుకుంటూ దేశాన్ని పటిష్ట పరుచుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పావులు ఏమైనా కదుపుతోందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
Read Also:Impact of Severe Heatwaves: ఉత్తరాదిలో నిప్పులు కురిపిస్తున్న భానుడు..(వీడియో)
ఇక, మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు జేడీయూ నేత నీరజ్ కుమార్ స్పందించారు. నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అందరికీ తెలిసిందే. గతంలో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ మైనార్టీ ప్రభుత్వాలను నడిపించారు కదా. అది మరిచిపోతే ఎలా అని సెటైరికల్ గా కామెంట్లు చేశారు. అలాగే, దేశ ప్రజలు మోడీ మద్దతుగా ఉన్నారు అని అన్నారు.
తాజావార్తలు
-
Mutual Funds: ఓ వైపు స్టాక్ మార్కెట్ పడిపోతున్నా.. విపరీతంగా పెరుగుతున్న SIP ఖాతాలు..
-
Raghav Chadha: ఆప్కు రాఘవ్ చద్దా భారీ షాక్.. ఏకంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి..
-
Sensex Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! దలాల్ స్ట్రీట్లో ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు లాస్..
-
Redmi Note 17 Pro Max: 200MP కెమెరా + 10,000mAh బ్యాటరీ.. Redmi Note 17 Pro Max షాక్ ఇస్తున్న లీక్లు
-
Royal Enfieldకు పోటీగా Yezdi Scrambler 350.. ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!