Mallikarjun Kharge: రాష్ట్రపతి పేరు ఉచ్చరిస్తూ నోరు జారిన ఖర్గే.. ముర్ము పేరును ఎలా పలికారో చూడండి..(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్చరించారు. ఈ అంశంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాయ్పూర్లోని సైన్స్ గ్రౌండ్లో జరిగిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఖర్గే రాష్ట్రపతిని ‘ముర్మా జీ’ అని ఉచ్చరించారు. అయితే.. ఆయన వెంటనే సరిదిద్దుకుని ‘ముర్ము’ అని పలికారు. కొన్ని సెకన్ల తర్వాత.. మళ్ళీ మాజీ రాష్ట్రపతి పేరును తప్పుగా ఉచ్చరించారు. ‘కోవింద్’ ను ‘కోవిడ్’ అని పలికారు.
READ MORE: YS Jagan Tour: రేపు చిత్తూరు పర్యటనలో జగన్ రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే..
Also Read
- Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
ఖర్గే ఏ అంశంపై ప్రసంగించారు?
ఛత్తీస్గఢ్ అడవుల్లో పెద్ద ఎత్తున చెట్ల నరికివేత అంశంపై మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే ఈ తప్పు చేశారు. బీజేపీ, దాని పారిశ్రామిక మిత్రులు భూమిని లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు.”మన నీరు, అడవి, భూమిని కాపాడుకోవాలి. మనం ఐక్యంగా ఉండాలి. వారు (బీజేపీ) (ద్రౌపది) ముర్మాను రాష్ట్రపతిగా, (రామ్ నాథ్) కోవిడ్ (కోవింద్)ను రాష్ట్రపతిగా చేశామని అంటున్నారు. కానీ మన వనరులను, మన అడవి, నీరు, భూమిని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. నేడు, అదానీ, అంబానీ వంటి వ్యక్తులు దానిని స్వాధీనం చేసుకుంటున్నారు.” అని ఖర్గే వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ చీఫ్ పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆయన చేసిన తప్పును “మహిళా, దళిత, గిరిజన వ్యతిరేకి” అని అభివర్ణించింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. “కాంగ్రెస్ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముపై అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారు. మొత్తం గిరిజన సమాజం దీనిని ఖండిస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఉద్దేశించి కూడా ఆయన కోవిడ్ లాంటి పదాలను ఉపయోగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ముర్మా జీ అని, కోవింద్ జీని కోవిడ్ జీ అని పిలవడం కాంగ్రెస్కు ఎస్సీ, ఎస్టీ వర్గాల పట్ల తీవ్ర ద్వేషాన్ని తెలియజేస్తుంది.” అని అన్నారు.
Kharge ji's venomous and diabolical attack on Presidents Murmu ji and Kovind ji exposes the dangerous deep rooted Dalit Virodhi mindset of the Congress party. For the Congress party not Dalit welfare but only Dynastic welfare has always been top priority.
Right from denying Dr.… pic.twitter.com/husj6YSkVz— C.R.Kesavan (@crkesavan) July 8, 2025
తాజావార్తలు
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!