Tummala Nageswara Rao : ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
- జై బాపు, జై భీం, జై సంవిధాన్.. సామాజిక న్యాయానికి తెలంగాణ పునాది
- సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
- పట్టుదలతో పనిచేస్తే ప్రజల్లో మంచి పేరు సంపాదించవచ్చు : మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageswara Rao : ఖమ్మం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సన్నర కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి పలు కీలక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించారని, 4,400 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన అవసరమని, అంబేద్కర్ సూచనల మేరకు, రాజ్యాంగాన్ని అనుసరించి సమానత్వాన్ని కల్పించడంలో తెలంగాణ మోడల్గా నిలుస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తుమ్మల చెప్పారు. 14 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఉన్నాయని, సన్నబియ్యం, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాలు నిరంతరంగా అమలు అవుతున్నాయని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. జపాన్ నుండి 12 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే కాదు, వాటితో ఉద్యోగాలుగా మార్చారు అని మంత్రి వివరించారు.
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
ఖానాపురం చెరువు నుండి ధంసలాపురం చెరువు వరకు రూ. 250 కోట్లతో అభివృద్ధి చేపట్టామని, రోడ్డు వెడల్పు పెంచితే అభివృద్ధి సాధ్యమని, ఇల్లు కోల్పోయిన పేదలకు మళ్లీ ఇళ్లు నిర్మించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు.. ఇళ్లు, రోడ్లు, నీరు.. ఇవే ప్రధానమైనవి అని, ఇవి అందించగలిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు.
పార్టీ సభ్యులు క్రమశిక్షణతో పనిచేయాలని, పేదలకు అవసరమైన సాయం అందించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. “పట్టుదలతో పని చేస్తే పార్టీ మీ పరువు కాపాడుతుందని నాయకులను ప్రోత్సహించారు మంత్రి తుమ్మల. బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లపై తప్పుడు కేసులు బనాయిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఇది రాజకీయ ప్రత్యర్థులను అణచివేయాలన్న ప్రయత్నమే అని ఆరోపించారు. డివిజన్ లలో అభివృద్ధి పనుల లిస్ట్ తీసుకుని ప్రజల్లోకి వెళ్లండని, జై బాపు, జై భీం, జై సంవిధాన్ పేరుతో కార్యక్రమాలను ప్రతి పంచాయతీలో నిర్వహించాలని తుమ్మల సూచించారు.
Pakistan: పాక్ ఆర్మీ భారత్తో ఎందుకు యుద్ధం కోరుకుంటోంది.. కారణాలు ఏంటి..?
తాజావార్తలు
-
Manav Suthar: టీమిండియాకు దొరికిన వజ్రం ఇతడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే: బీసీసీఐ
-
AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
-
China: “మనం శత్రువులం కాము”.. భారత్కు చైనా సందేశం..
-
INDIA Bloc: 2 ఏళ్ల తర్వాత విపక్ష కూటమి భేటీ.. ఏం చర్చించారంటే..!
-
SlumDog Movie Teaser: ‘మా బతుకులతో ఆడుకుంటే వదలం’.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ ‘స్లమ్డాగ్’ టీజర్!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!