Tummala Nageswara Rao : ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
- జై బాపు, జై భీం, జై సంవిధాన్.. సామాజిక న్యాయానికి తెలంగాణ పునాది
- సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
- పట్టుదలతో పనిచేస్తే ప్రజల్లో మంచి పేరు సంపాదించవచ్చు : మంత్రి తుమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageswara Rao : ఖమ్మం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సన్నర కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి పలు కీలక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించారని, 4,400 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన అవసరమని, అంబేద్కర్ సూచనల మేరకు, రాజ్యాంగాన్ని అనుసరించి సమానత్వాన్ని కల్పించడంలో తెలంగాణ మోడల్గా నిలుస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తుమ్మల చెప్పారు. 14 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఉన్నాయని, సన్నబియ్యం, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాలు నిరంతరంగా అమలు అవుతున్నాయని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. జపాన్ నుండి 12 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే కాదు, వాటితో ఉద్యోగాలుగా మార్చారు అని మంత్రి వివరించారు.
Also Read
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
- CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
ఖానాపురం చెరువు నుండి ధంసలాపురం చెరువు వరకు రూ. 250 కోట్లతో అభివృద్ధి చేపట్టామని, రోడ్డు వెడల్పు పెంచితే అభివృద్ధి సాధ్యమని, ఇల్లు కోల్పోయిన పేదలకు మళ్లీ ఇళ్లు నిర్మించాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు.. ఇళ్లు, రోడ్లు, నీరు.. ఇవే ప్రధానమైనవి అని, ఇవి అందించగలిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు.
పార్టీ సభ్యులు క్రమశిక్షణతో పనిచేయాలని, పేదలకు అవసరమైన సాయం అందించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. “పట్టుదలతో పని చేస్తే పార్టీ మీ పరువు కాపాడుతుందని నాయకులను ప్రోత్సహించారు మంత్రి తుమ్మల. బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లపై తప్పుడు కేసులు బనాయిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఇది రాజకీయ ప్రత్యర్థులను అణచివేయాలన్న ప్రయత్నమే అని ఆరోపించారు. డివిజన్ లలో అభివృద్ధి పనుల లిస్ట్ తీసుకుని ప్రజల్లోకి వెళ్లండని, జై బాపు, జై భీం, జై సంవిధాన్ పేరుతో కార్యక్రమాలను ప్రతి పంచాయతీలో నిర్వహించాలని తుమ్మల సూచించారు.
Pakistan: పాక్ ఆర్మీ భారత్తో ఎందుకు యుద్ధం కోరుకుంటోంది.. కారణాలు ఏంటి..?
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!