Nama Nageswara Rao: కాంగ్రెస్కి అధికారం ఇచ్చినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అశ్వారావుపేట అసెంబ్లీలో బీఆర్ఎస్ కు తిరుగులేదన్నారు.. ఇక్కడ కృష్ణార్జునులలా మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు గొప్పగా పని చేస్తున్నారు అని తెలిపారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ అశ్వారావుపేట నుంచే వచ్చింది.. ఇప్పుడు కూడా అదే పునరావృతం కావాలి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వేసవి రాక ముందే నీటి ఎద్దడి నెలకొంది.. రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి కారణంగా సుమారు 15 లక్షల ఎకరాల పంటలు దెబ్బ తిన్నాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఎప్పుడూ గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునే వారు.. ఆ విధంగానే సంక్షేమ పథకాలు కూడా ప్రవేశ పెట్టారు.. దేశంలో ప్రతీ ఇంటికి నల్లా నీరు ఇచ్చిన రాష్ట్రం ఏదని పార్లమెంట్ లో నేను ప్రశ్నిస్తే తెలంగాణ అని సమాధానం వచ్చింది అని నామా నాగేశ్వరరావు అన్నారు.
Also Read
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
అదే విధంగా వరి ఎక్కువ పండించే రాష్ట్రం ఏదంటే అక్కడ కూడా తెలంగాణనే ముందుంది.. ఈ ఘనత కేసీఆర్ దే అని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టినందుకు గ్రామాల్లో ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు.. సర్వరోగ నివారిణిలా ప్రతీదానికీ డిసెంబర్ 9ని చూపెట్టారు. డిసెంబర్ దాటి 4 నెలలు అయ్యింది.. హామీలు అమలు చేయడం చేతగాక ఇప్పుడు కొత్త పాట మొదలెట్టారు.. అత్యధిక ఎంపీలు కట్టబెట్టండి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అంటున్నారు.. గత పార్లమెంట్ లో తెలంగాణ తరపున గళమెత్తింది ఒక్క బీఆర్ఎస్ పార్టీనే.. తెలంగాణ ప్రజల సమస్యలను పార్లమెంట్ లో లెవనెత్తాలంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అభివృద్ధి జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి దీవించాలి.. ఖమ్మం జిల్లాలో కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది.. కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించేది ఒక్కటే.. బిడ్డా బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఆగమాగం చేస్తామని నామా నాగేశ్వరరావు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Nandini : “ఆమె నా కోడలు కాదు.. కూతురు.. భట్టి సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!