Nama Nageswara Rao: కాంగ్రెస్కి అధికారం ఇచ్చినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు..
బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అశ్వారావుపేట అసెంబ్లీలో బీఆర్ఎస్ కు తిరుగులేదన్నారు.. ఇక్కడ కృష్ణార్జునులలా మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు గొప్పగా పని చేస్తున్నారు అని తెలిపారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ అశ్వారావుపేట నుంచే వచ్చింది.. ఇప్పుడు కూడా అదే పునరావృతం కావాలి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వేసవి రాక ముందే నీటి ఎద్దడి నెలకొంది.. రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి కారణంగా సుమారు 15 లక్షల ఎకరాల పంటలు దెబ్బ తిన్నాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఎప్పుడూ గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునే వారు.. ఆ విధంగానే సంక్షేమ పథకాలు కూడా ప్రవేశ పెట్టారు.. దేశంలో ప్రతీ ఇంటికి నల్లా నీరు ఇచ్చిన రాష్ట్రం ఏదని పార్లమెంట్ లో నేను ప్రశ్నిస్తే తెలంగాణ అని సమాధానం వచ్చింది అని నామా నాగేశ్వరరావు అన్నారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
అదే విధంగా వరి ఎక్కువ పండించే రాష్ట్రం ఏదంటే అక్కడ కూడా తెలంగాణనే ముందుంది.. ఈ ఘనత కేసీఆర్ దే అని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టినందుకు గ్రామాల్లో ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు.. సర్వరోగ నివారిణిలా ప్రతీదానికీ డిసెంబర్ 9ని చూపెట్టారు. డిసెంబర్ దాటి 4 నెలలు అయ్యింది.. హామీలు అమలు చేయడం చేతగాక ఇప్పుడు కొత్త పాట మొదలెట్టారు.. అత్యధిక ఎంపీలు కట్టబెట్టండి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అంటున్నారు.. గత పార్లమెంట్ లో తెలంగాణ తరపున గళమెత్తింది ఒక్క బీఆర్ఎస్ పార్టీనే.. తెలంగాణ ప్రజల సమస్యలను పార్లమెంట్ లో లెవనెత్తాలంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అభివృద్ధి జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి దీవించాలి.. ఖమ్మం జిల్లాలో కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది.. కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించేది ఒక్కటే.. బిడ్డా బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఆగమాగం చేస్తామని నామా నాగేశ్వరరావు హెచ్చరించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో