Kakarla suresh: కాకర్ల సమక్షంలో టీడీపీలోకి చేరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోనే జలదంకి మండలం బ్రాహ్మణ కాక గ్రామ ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు నాయకులు పోటెత్తారు. తొమ్మిదవ మైల నుంచి రైతన్నలు సుమారు 200 ట్రాక్టర్ల ర్యాలీతో మద్దతు పలికారు. తెలుగుదేశం- జనసేన- బీజేపీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ ద్వారా సంఘీభావం తెలిపారు. గజమాలతో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, వంటేరు వేణుగోపాల్ రెడ్డిలను సన్మానించారు. మండలంలోని నలుదిక్కుల నుంచి పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాద సభకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి నాయకత్వంలో జలదంకి మండలం నాయకుల ఆధ్వర్యంలో బ్రాహ్మణ కాకకు చెందిన సుమారు 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Read Also: Memantha Siddham Bus Yatra: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ ముఖ్యనేత!
Also Read
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Nepal Floods: నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
- కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
టీడీపీలోకి జాయిన్ అయిన వారందరికీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వంటేరు వేమిరెడ్డి, కాకర్ల కావ్య నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం జిందాబాద్ నారా చంద్రబాబునాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అని స్లోగన్స్ ఇచ్చారు. గత నెల 30వ తేదీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జలదంకి మండలానికి చెందిన ఎంపీపీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు సర్పంచులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం నాడు జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బ్రాహ్మణ కాక ఖాళీ అయింది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తేనే మన నియోజకవర్గం బాగుపడుతుంది అని వంటేరు వేణుగోపాల్ రెడ్డి అన్నారు.
Read Also: Production No2: హీరోయిన్ గా దృశ్యం పాప రెండో సినిమా.. ఏకంగా ప్రొడ్యూసర్ కొడుకుతో..!
ఈ కార్యక్రమంలో కావలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు భరత్ కుమార్, సురేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి రంగారావు, జనసేన ఇన్చార్జ్ పొట్టే వెంకటేశ్వర్లు, మాజీ ఎంసీ చైర్మన్ మన్నటి వెంకటరెడ్డి, జలదంకి మండల నాయకులు జయచంద్ర రెడ్డి, జనార్దన్ రెడ్డి, మధు మోహన్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు, బీజేపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తాజావార్తలు
-
TOXIC : టాక్సిక్ టాక్ ఏంటి.. డే-1 ఈ కలెక్షన్స్ ఏంటి?
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
-
Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
-
Nepal Floods: నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!