Ketamreddy Vinod Reddy: జనసేనకు మరో షాక్.. పార్టీకి కేతంరెడ్డి గుడ్బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketamreddy Vinod Reddy: జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది.. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న జనసేన పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తప్పడంలేదు.. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నాల్గో విడత వారాహివిజయ యాత్రను కృష్ణా జిల్లాలో విజయవంతం చేశారు.. అయితే, వరుస రాజీనామాలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి.. నిన్నటికి నిన్న జనసేన పార్టీకి రాజీనామా చేశారు పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి రాజీనామా చేశారు.. 2014 ఎన్నికల్లో జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. అయితే, మూడు నెలల క్రితం పిఠాపురం ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది జనసేన పార్టీ అధిష్టానం.. దీంతో.. మనస్థాపానికి గురైన మాకినీడి శేషుకుమారి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. మరోవైపు.. నెల్లూరు ఇప్పుడు జనసేన పార్టీకి సీనియర్ నేత రాజీనామా చేశారు..
Read Also: Rohit Sharma: రికార్డులపై ఎక్కువగా దృష్టి పెట్టను.. అలా చేస్తే..: రోహిత్ శర్మ
Also Read
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
జనసేన పార్టీకి నెల్లూరు సిటీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్టు వెల్లడించారు.. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వినోద్ రెడ్డి.. ఓటమి పాలయ్యారు.. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నా.. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ వచ్చారు.. ఇక, ఆ మధ్య వినోద్ రెడ్డితో వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చర్చలు జరిపి పార్టీలోకి రావాలని ఆహ్వానించడంతో ఆయన అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన వైసీపీలోకి ఆహ్వానించడంతో వినోద్ రెడ్డి అంగీకరించినట్టు తెలిసింది.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కాగా, జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నెల్లూరు నగరం నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవడంతోనే కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. నెల్లూరు సిటీ టీడీపీ ఇంఛార్జిగా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు.. మరోసారి ఆయన బరిలోకి దిగబోతున్నారు.. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసేందుకు అవకాశాలు లేకపోవడంతో వైసీపీలో చేరేందుకు సిద్ధమైన ఆయన.. జనసేన పార్టీకి రాజీనామా ప్రకటించినట్టు సమాచారం.
జనసేన పార్టీకి రాజీనామా. జైహింద్.@JanaSenaParty @PawanKalyan pic.twitter.com/0dMXnmnvko
— Kethamreddy Vinod Reddy (@keathamreddy) October 12, 2023
తాజావార్తలు
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్గా ఎలా మారింది?
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..