Kesineni Nani: సీఎం జగన్ మేనిఫెస్టో చూసి ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వియజవాడ ఎంపీగా వైసీపీ తరపున కేశినేని నాని పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్ లో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోను చూసి ప్రజలందరు చాలా హ్యాపీగా ఉన్నారని తెలిపారు. వైఎస్సార్ చేయూత కింద 1.5 లక్షల రూపాయలకు పెంచారు, అమ్మ ఒడి కూడా 15000 నుంచి 17000 రూపాయలకి పెంచారు, పెన్షన్లు 3 వేల నుంచి 3,500కు పెంచారని పేర్కొన్నారు. ఇక, నవ రత్నాలు మంచి సక్సెస్ అయ్యాయి.. కాపు నేస్తం కూడా కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించడం సంతోషకరమైన విషయం అని కేశినేని శ్వేత ప్రకటించారు.
Read Also: LSG vs RR: ఆదుకున్న కేఎల్ రాహుల్, దీపక్ హూడా.. రాజస్థాన్ టార్గెట్ 197..
Also Read
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
కాగా, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల పక్షాన ఉండి ఇన్ని పథకాలు ప్రకటించారని కేశినేని శ్వేత పేర్కొన్నారు. నెక్స్ట్ టర్మ్ లో కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించేందుకు సీఎం జగన్ ముందుకు వచ్చారన్నారు. కేశినేని నాని గత 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు అందుబాటులో ఉండి అనేక అభివృద్ధి పనులు చేశారు.. నీతిగా నిజాయితీగా నిస్వార్ధంగా పని చేసిన వ్యక్తి కేశినేని నాని అని ఆమె వెల్లడించారు. కేశినేని భవన్ ద్వారా ప్రజలకు ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటారు.. ఫ్లైఓవర్, హాస్పిటల్, ఎయిర్ పోర్ట్, ఇవ్వన్నీ కేశినేని నాని విజయవాడ ప్రాంతానికి తీసుకొచ్చి చేసిన అభివృద్ధి పనులు అని కేశినేని శ్వేత చెప్పుకొచ్చారు.
Read Also: Ap Bjp: కాంగ్రెస్ ఎక్స్ ఖాతాపై బీజేపీ ఫిర్యాదు.. అసలేమైదంటే..?
ఇక, కేశినేని నాని విజయవాడ ప్రాంత ప్రజల గుండెల్లో ఉన్నాడు అని కేశినేని శ్వేత తెలిపారు. అలాగే, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అసిఫ్ లోకల్ పర్సన్ మంచి వాడు మా వాడిగా ఆయన్నీ విజయవాడ ప్రజలు భావిస్తారు.. అసిఫ్ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.. ఎన్డీయే కూటమి తరుపున ఈ నియోజకవర్గంలో స్కామర్స్, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళని ఈ ప్రాంతానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ప్రజలు అంతా చూస్తున్నారు.. ఈసారి విజయవాడ ఎంపీగా కేశినేని నాని, ఎమ్మెల్యేగా ఆసిఫ్ ఘన విజయం సాధిస్తారని కేశినేని శ్వేత వెల్లడించారు.
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!