Kerala: కుమారుడికి “ఉగ్ర” పాఠాలు.. 16 ఏళ్ల కొడుకుని ISISలోకి చేరమని ఒత్తిడి చేసిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురం నుంచి 16 ఏళ్ల బాలుడిని అతని తల్లి, సవతి తండ్రి ఇస్లామిక్ స్టేట్లో చేరమని ఒప్పించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, UAPA కింద కేసు నమోదు చేశారు. అంతే కాదు.. తన తల్లి ఏకంగా ISISలో చేరాలని.. ఆ భావజాలాన్ని పెంపొందించుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
READ MORE: Semiyarka: అద్భుతం.. బయటపడ్డ 3,600 ఏళ్ల నాటి కంచు యుగం నగరం..!
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురం పతనంతిట్టకు చెందిన ఓ మహిళ ఇస్లాం మతంలోకి మారి, వెంబయంకు చెందిన వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఈ జంట UKలో నివసిస్తున్నారు. బాలుడు(16) ఇటీవల UKకి వెళ్లాడు. అయితే.. అక్కడ అతడి తల్లి, సవతి తండ్రి కొన్ని వీడియోలు చూపించి, ఐసీస్ (ISIS) భావజాలం వైపు ఆకర్షించేలా ప్రయత్నించారని బాలుడు ఆరోపించారు. ఇటీవల ఆ టీనేజర్ తిరిగి కేరళకు వచ్చారు. అనంతరం అతడిని అట్టింగల్లోని ఒక మత అధ్యయన కేంద్రంలో చేర్పించారు. అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పును గమనించారు. తల్లి, బంధువులకు వెంటనే సమాచారం అందించారు. దీంతో ఆ బాలుడి మామ ఈ విషయంపై ఆ టీనేజర్ నిలదీశాడు. దీంతో జరిగిన విషయాన్ని వివరించాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన టీనేజర్ మామ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ అంశంపై పోలీసులు కేసు నమోదు చేసి, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. టీనేజర్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, మానసిక కౌన్సెలింగ్ అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంతలో బాలుడి తల్లి ఈ ఆరోపణలన్నింటినీ పూర్తిగా తోసిపుచ్చింది. తాను రెండో వివాహం చేసుకోవడంతో, తన మొదటి(విడిపోయిన) భర్త ఇలాంటి ఆరోపణలు చేయడానికి బిడ్డను ఉపయోగిస్తున్నాడని ఆమె చెబుతోంది. తాను యూకేలో నర్సుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నానని ఈ ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తల్లి పోలీసులకు తెలిపింది. మరోవైపు.. UAPA కింద అట్టింగల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దర్యాప్తునకు నాయకత్వం వహిస్తున్నారు. ఉగ్రవాద నిరోధక సంస్థ అయిన NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) కూడా ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం ప్రారంభించింది. తిరువనంతపురం గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్, యాంటీ-టెర్రర్ స్క్వాడ్ వంటి ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!