Kejriwal: బీజేపీపై కేజ్రీవాల్ సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాట్లకు కావాల్సిన సీట్లను బీజేపీ గెలుచుకోలేదని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. తాను తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఎంతో మంది నిపుణులు, సెఫాలజిస్టులతో మాట్లాడనని చెప్పారు. శుక్రవారం కేజ్రీవాల్కు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన ఢిల్లీలో పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారం కోల్పోతుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Fisher Man: తస్సదియ్యా.. చేపలు పడదామనుకుంటే ఇలా జరిగిందేంటి.. వీడియో వైరల్..
Also Read
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
- అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను అంతం చేయాలని, నియంతృత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో బీజేపీకి 400 సీట్లు కావాలని అంటున్నారని ఆరోపించారు. జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని.. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పిస్తామని, ఎల్జీని సొంతం చేసుకుంటామని చెపక్పారు. దేవుడు తనకు 21 రోజులు సమయం ఇచ్చాడని.. 24 గంటలు పనిచేస్తానని, దేశమంతా తిరుగుతానని చెప్పారు. ఈ నియంతృత్వాన్ని అంతం చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Pakistan: PIA ఎయిర్లైన్ నిర్లక్ష్యం.. చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
బీజేపీ ఈసారి కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్లలో చాలా సీట్లు కోల్పోనున్నట్లు తెలిసిందన్నారు. ఫోన్లో చాలా మంది సెఫాలజిస్టులతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు బీజేపీకి మెజారిటీ రాదనే చెబుతున్నారన్నారు. ఇక ఢిల్లీ విషయానికి వస్తే మొత్తం 7 ఎంపీ సీట్లలో బీజేపీ ఓడిపోతుందన్నారు.
ఆప్ తూర్పు ఢిల్లీ లోక్సభ అభ్యర్థి కుల్దీప్ కుమార్కు మద్దతుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి కృష్ణానగర్లో రోడ్షో నిర్వహించారు. ఢిల్లీలోని మొత్తం 7 పార్లమెంట్ స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. దాదాపు 50 రోజుల తర్వాత ఆయనకు విముక్తి లభించింది. మధ్యంతర బెయిల్ దొరకడంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar : ఎన్నికల కోడ్ అయిపోగానే మహిళలకు మహాలక్ష్మి కింద రూ.2,500 ఇస్తాం
తాజావార్తలు
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!