Pakistan: PIA ఎయిర్లైన్ నిర్లక్ష్యం.. చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో హృదయ విదారకమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) ఉద్యోగులు ఇస్లామాబాద్ నుంచి స్కర్దుకు వెళ్తున్న ఆరేళ్ల చిన్నారి మృతదేహాన్ని విమానంలోకి తీసుకెళ్లడం మర్చిపోయారు. విమాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆరేళ్ల బాలుడి మృతదేహం విమానాశ్రయంలోనే ఉండిపోయింది. డాన్ కథనం ప్రకారం.. అంతకుముందు చిన్నారి తల్లిదండ్రులు విమానం ఎక్కారు. అయితే.. పిఐఎ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మరణించిన చిన్నారిని ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ఉంచారు. దీంతో.. ఎయిర్లైన్స్ కంపెనీ ఉద్యోగులు తన కుమారుడి మృతదేహాన్ని విమానం ఎక్కించలేదని తెలియగానే షాక్కు గురై స్పృహతప్పి పడిపోయారు.
Yogi Adityanath: ఈ ఎన్నికలు రామ భక్తులకు, రామ ద్రోహులకు మధ్య జరుగుతోంది..
Also Read
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
వివరాల్లోకి వెళ్తే.. ఖర్మంగ్ జిల్లా కాట్షి గ్రామానికి చెందిన ముహమ్మద్ అస్కారీ యొక్క ఆరేళ్ల కుమారుడు ముజ్తబాకు స్కర్డులోని ఆసుపత్రిలో కణితి ఉన్నట్లు నిర్ధారణ అయింది. నెల రోజుల క్రితం డాక్టర్లు ముజ్తబాను చికిత్స నిమిత్తం రావల్పిండికి రెఫర్ చేశారు. దీంతో.. తండ్రి ముహమ్మద్ అస్కారీ, తల్లి ముజ్తబాను రావల్పిండికి తీసుకువెళ్లారు. అక్కడ బెనజీర్ భుట్టో ఆసుపత్రిలో కొన్ని వారాలపాటు చికిత్స పొందుతున్నాడు. కాగా.. చిన్నారి ముజ్తబా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
అయితే.. ఎండల దృష్ట్యా తమ బిడ్డ మృతదేహాన్ని శుక్రవారం విమానం ద్వారా వారి స్వగ్రామం కాట్షికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులు, మరొక బంధువు శుక్రవారం ఉదయం ఇస్లామాబాద్ నుండి స్కర్దుకు PK-451 విమానంలో టిక్కెట్లను ధృవీకరించారు. వారు ఉదయం 6 గంటలకు మృతదేహాన్ని ఇస్లామాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. SOPలు, ఎయిర్లైన్ నిబంధనలను అనుసరించి.. మృతదేహానికి కార్గో ప్రక్రియను పూర్తి చేసి చెల్లింపు చేశారు. అయితే.. పొరపాటున చిన్నారి మృతదేహాన్ని విమానం ఎక్కించలేదని.. ఇస్లామాబాద్ విమానాశ్రయంలోనే ఉన్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది.
Mamata Banerjee: ఆ గవర్నర్ ఉన్నంతవరకు రాజ్భవన్కు వెళ్లను
ఈ వార్తతో తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురై విలపించారు. దీంతో వారు PIA యాజమాన్యం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. పిఐఎ, సివిల్ ఏవియేషన్ అథారిటీ మరియు ఇతర విభాగాల అధికారులు తల్లిదండ్రులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. వారి తప్పును అంగీకరించారు. శనివారం తమ చిన్నారి మృతదేహాన్ని అప్పజెప్పుతామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. కాగా.. బాడీని లోడ్ చేయకపోవడానికి విమానాశ్రయంలో కార్గో నిర్వహించే కంపెనీదే బాధ్యత అని పిఐఎ అధికారులు తెలిపారు. ఈ నిర్లక్ష్యానికి సంబంధించి వారిపై చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!