Arvind Kejriwal: బీజేపీని ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్కు ఆయుధం దొరికింది?.. అదేంటంటే?
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ
- మహిళల భద్రత, నేరాలపై ఆప్ ప్రశ్నలు
- వీటిని ఆయుధంగా మలచుకునేందుకు యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. మహిళల భద్రత, రాజధానిలో పెరుగుతున్న నేరాల గ్రాఫ్ను ఎన్నికల ముందు పెద్ద సమస్యగా మార్చాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. గత నెల రోజుల నుంచి ఢిల్లీలో శాంతిభద్రతలు, మహిళా భద్రతపై కేజ్రీవాల్ కేంద్రాన్ని నిందిస్తున్నారు. వీటిని ఆయుధంగా మలచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశాల్లో కేంద్రం పూర్తిగా విఫలమైందని జనాలను నమ్మించి.. ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
READ MORE: Minister Komatireddy: అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో ‘మహిళా అదాలత్’కు పిలుపునిచ్చారు. ఇందులో కేజ్రీవాల్ మహిళలను ఉద్దేశించి కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ మహిళలు ఎంతకాలం భయంభయంగా బతుకుతారని కేజ్రీవాల్ అన్నారు. నిర్భయ ఘటన జరిగి నేటికి 12 ఏళ్లవుతుందని..ఈ ఘటన జరిగినప్పుడు దేశం మొత్తం వీధుల్లోకి వచ్చినట్లు గుర్తుచేశారు. ఈ ఘటన తర్వాత మహిళలపై నేరాలు అంతం అవుతాయని భావించినా.. అది జరగలేదని.. నేరాలు పెరుగుతున్నాయన్నారు. ఈరోజు ఢిల్లీలో కూతుళ్లు కాలేజీకి వెళితే సాయంత్రం 7 గంటలకే తల్లిదండ్రుల గుండెలు దడదడలాడుతున్నాయన్నారు. ఢిల్లీలో నేరస్తులను ఎందుకు పట్టుకోవడం లేదో ఎవరైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు.
“10 సంవత్సరాల క్రితం ఓటర్లు పాఠశాల, ఆసుపత్రిని బాగు చేసే బాధ్యతను నాకు ఇచ్చారు. రెండింటినీ ఎలా పరిష్కరించాలో చూపించాను. కరెంటును చౌకగా ఇవ్వాలని కోరారు. నేను ఉచితంగా అందజేశాను. కానీ ఢిల్లీలో ప్రజల భద్రత బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అమిత్ షా ప్రజలకు భద్రతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీలో రోజుకు 3-4 అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అమిత్ షా శాంతిభద్రతలు మీకు సమస్య కాకపోవచ్చు. సాధారణ జనాలను ఇదో పెద్ద సమస్యగా మారింది.” అని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!