Bandi Sanjay Kumar: కేసీఆర్ వివరణ అహంకార పూరిత వైఖరికి నిదర్శనం: బండి సంజయ్
- కేసీఆర్ లేఖలో జస్టిస్ నర్సింహరెడ్డిని అవమానించారని ఆరోపణ
- కేసీఆర్ ఆ కమిషన్ నే అవమానించేలా లేఖ రాయడం సరికాదు
- హైదరాబాద్ లో శనివారం విడుదల చేసిన ప్రకటనలో బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నర్సింహరెడ్డిని అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకార పూరిత వైఖరికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. “ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా నియమించిన కమిషన్ కు కనీస గౌరవం ఇవ్వాలనే ఇంగిత జ్నానం లేకపోవడం సిగ్గు చేటు. చీఫ్ జస్టిస్ గా పనిచేసిన నర్సింహారెడ్డి విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ చేస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేస్తే.. వాస్తవాలను ముందుంచాల్సిన కేసీఆర్ ఆ కమిషన్ నే అవమానించేలా లేఖ రాయడం క్షమించరానిది. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఛీ కొట్టి ఓడించినా కేసీఆర్ లో అహంకారం తగ్గలేదు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్న కేసీఆర్ వాదనలో పస ఉంటే న్యాయస్థానానికి ఎందుకు వెళ్లలేదు? కోర్టులో తన వాదనలను ఎందుకు విన్పించలేదు? విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అనేక అక్రమాలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ తన ద్రుష్టికి వచ్చిన సమాచారం ఆధారంగా వివిధ రూపాల్లో క్రాస్ ఎగ్జామిషన్ చేస్తుంది. అందులో భాగంగా అంతర్గతంగా, బహిరంగంగా విచారణ చేసే అధికారం ఆ కమిషన్ కు ఉంది. దీనిని తప్పుపట్టడం హాస్యాస్పదం.” అని తెలిపారు.
READ MORE: Kurnool: ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజల కలకలం
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) నిర్ణయాలను జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఇంతవరకు ఎక్కడా ప్రశ్నించలేదని.. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, దాని ఆధారంగా జరిగిన అనేక అవినీతి, అక్రమాలపైనే విచారణ జరుపుతోందే తప్ప ఈఆర్సీ పై కాదని బండి సంజయ్ ప్రకటన పేర్కొన్నారు. “ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈఆర్సీని వివాదంలోకి లాగి బదనాం చేయడం సిగ్గు చేటు. కేసీఆర్ తన లేఖలో తెలంగాణ బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డి అని సంబోధిస్తూనే ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పేర్కొనడం దుర్మార్గం. నర్సింహారెడ్డి తెలంగాణ బిడ్డ కాబట్టే ఆనాడు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కేంద్రానికి జస్టిస్ శ్రీక్రిష్ణ కమిటీ పంపిన రహస్య నివేదికను బహిరంగ పర్చాలని ఆదేశాలు జారీ చేసి ఆ కమిటీలోని 8వ ఛాప్టర్ అంశాలను బట్టబయలు చేయించిన ధైర్యశాలీ జస్టిస్ నర్సింహారెడ్డి. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉంటూ పోరాడిన ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు బయటకు రాకుండా వర్శిటీ గేటు ఎదుట ముళ్లకంచెలు వేసి నిర్బంధిస్తే… ముళ్ల కంచెను తీసివేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముద్దు బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డి. అలాంటి వ్యక్తి చిత్తశుద్ధిని శంకించేలా కేసీఆర్ గు వ్యవహరించడం, చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వితండవాదం చేయడం సిగ్గు చేటు.” అని ప్రకటన ద్వారా వివరించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!