KCR: లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ కసరత్తు.. నేతలతో ఏం చర్చించారంటే..!
పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కేడర్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఎన్నికల మూడ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కార్యకర్తలను చైతన్య పరిచారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం చేయాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
Ingenuity: అంగారకుడిపై నాసా “హెలికాప్టర్” ఇక పనిచేయదు.. పలుచటి వాతావరణంలో అద్భుతం సృష్టించింది..
Also Read
- Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే...
- MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
- Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
- Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?
తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. గత కొంత కాలంగా తుంటి మార్పిడితో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు దేశంలో చోటుచేసుకున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ తెలుసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఎలాగైనా మెజార్టీ సీట్లలో విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. గజ్వేల్లోని ఎర్రవెల్లి ఫాంహౌస్లో లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై నేతలతో మేథోమదనం చేశారు. ఈ సందర్భంగా నేతలకు కేసీఆర్ పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేటీఆర్ కూడా హాజరయ్యారు.
Darshan: హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరో… భార్య సంచలనం?
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చుంది. ఊహించని ఓటమితో ఆ పార్టీ నేతలంతా షాక్కు గురయ్యారు. ఇప్పుడిప్పుడే ఈ వాతావరణం నుంచి బయటకు వస్తున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపే ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తోంది. ఇక ప్రతిపక్ష పార్టీ విమర్శలను అధికార పక్షంగా కూడా అంతే ధీటుగా తిప్పికొడుతోంది. మరీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు గెలుచుకుంటారో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!