KCR: లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ కసరత్తు.. నేతలతో ఏం చర్చించారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కేడర్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఎన్నికల మూడ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కార్యకర్తలను చైతన్య పరిచారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం చేయాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
Ingenuity: అంగారకుడిపై నాసా “హెలికాప్టర్” ఇక పనిచేయదు.. పలుచటి వాతావరణంలో అద్భుతం సృష్టించింది..
Also Read
- Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
- US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. గత కొంత కాలంగా తుంటి మార్పిడితో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు దేశంలో చోటుచేసుకున్న రాజకీయాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ తెలుసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఎలాగైనా మెజార్టీ సీట్లలో విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. గజ్వేల్లోని ఎర్రవెల్లి ఫాంహౌస్లో లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై నేతలతో మేథోమదనం చేశారు. ఈ సందర్భంగా నేతలకు కేసీఆర్ పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేటీఆర్ కూడా హాజరయ్యారు.
Darshan: హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరో… భార్య సంచలనం?
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చుంది. ఊహించని ఓటమితో ఆ పార్టీ నేతలంతా షాక్కు గురయ్యారు. ఇప్పుడిప్పుడే ఈ వాతావరణం నుంచి బయటకు వస్తున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపే ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తోంది. ఇక ప్రతిపక్ష పార్టీ విమర్శలను అధికార పక్షంగా కూడా అంతే ధీటుగా తిప్పికొడుతోంది. మరీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు గెలుచుకుంటారో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
-
Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..