ఐదునెలల్లో తెలంగాణ ఎందుకు ఆగమైంది.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెప్పపాటు కరెంట్ పోలేదు.. ఇప్పుడెందుకు కరెంట్ కోతలు విధిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బస్సు యాత్రంలో భాగంగా మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటికి ఇచ్చిన నీళ్లు ఇప్పుడెందుకు మాయం అయ్యాయి. కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైందని ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.రుణ మాఫి ఏదీ, రైతు బంధు ఎక్కడ అని ప్రశ్నించారు. 2500 రూపాయలు ఏవని అడిగారు.
READ MORE: Jason Sanjay: విజయ్ కొడుక్కి శంకర్ ఫ్యామిలీతో ఏం పని?
రైతు బంధు డబ్బులు ఎటు పోయాయని కేసీఆర్ ప్రశ్నించారు.పనికి మాలిన పని ఫ్రీ బస్సు పెట్టారని.. దాంతో మహిళలు సిక్కెలు పట్టుకుని కొట్టుకుంటున్నారన్నారు. ఆటో కార్మికుల బతుకు ఆగం అయ్యిందని తెలిపారు. సీఎం ఏఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. అడ్డగోలు హమీ లిచ్చారని.. ఏవీ అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటున్నారన్నారు. లక్షల ఎకరాల పంటలు ఎండబెట్టారన్నారని.. పంట తీసుకొస్తే కొనే దిక్కులేకుండా పోయిందని తెలిపారు. బోనస్ బోగసే.. రైతులు సచ్చిపోతున్నారన్నారు. కొత్త జిల్లాలను సీఎం తీసేస్తా అంటున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాను తీసేస్తామంటున్నారని.. మంచిర్యాల జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయండని ఓటర్లుకు సూచించారు. జిల్లా వద్దనుకుంటే కాంగ్రెస్ కు ఓటేయండన్నారు.