KCR: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు బీమా ఉంటుందో.. ఉండదో తెలియని పరిస్థితి ఏర్పడిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా సూర్యాపేటకు చేరుకున్న ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికే కరెంట్ మాయమైపోయిందన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. రైతు పండించిన ధాన్యం కొనుగోలులో సర్కార్ విఫలమైందని విమర్శించారు. రుణ మాఫీ ఏమైంది.? దళిత బందు ఉంటుందో లేదో తెలియదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న పొరపాటు జరిగితే.. సరిదిద్దకుండా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఇవ్వడానికి చేతకావడం లేదని విమర్శించారు.
READ MORE: Shocking Video: ఉన్నట్టుండి ఎంత ఘోరం.. గోడపడి నలుగురి దుర్మరణం.. వీడియో వైరల్..
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
నాగార్జున సాగర్ నీళ్ల దోపిడీ జరుగుతుంటే సాగునీటి శాఖ మంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ను భయపెడితే భయపడడని.. ఒక వేళ భయపడి ఉంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. నా ప్రజలు బాధపడితే.. వాళ్ళ కోసం నా ప్రాణం పోయినా లెక్కచేయనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే రైతుబంధు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ బలమని తెలిపారు. మంచి మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థులను పార్లమెంటుకు పంపాలని కోరారు. పార్లమెంటులో బలం ఉంటేనే తెలంగాణ హక్కులు కాపాడబడతాయని స్పష్టం చేశారు. మొదటి రోజు కేసీఆర్ బస్సు యాత్ర ముగిసింది.సూర్యాపేటకు చేరిన ఆయన రాత్రి అక్కడే బస చేయనున్నారు. తిరిగి రేపు ఉదయం సూర్యాపేట నుండి భువనగిరి వరకు కేసీఆర్ రెండవ రోజు బస్సు యాత్ర కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!