Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
- కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో 21 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది.
- ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో అపహరణ.
- అత్యాచారం అనంతరం యువతి హత్య
- నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాలకృత్యాల కోసం బయటకు వెళ్లిన 21 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఒక వ్యవసాయ బావి వద్ద కనుగొన్నారు. ఆగస్టు 19 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హోక్రాణి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలి తండ్రి తిమ్మారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. తిమ్మారెడ్డి కుమార్తె అశ్విని తన తల్లిదండ్రులతో కలిసి పొలాల్లో పని ముగించుకుని సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చింది. బి.ఏ డిగ్రీ పూర్తి చేసుకున్న అశ్విని, ఆ తర్వాత కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో, ఒక పాత్రను తీసుకుని సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి వెతకడానికి వెళ్లిన క్రమంలో అశ్విని చెప్పులు కనిపించాయి. కుటుంబ సభ్యులంతా రాత్రంతా అశ్విని కోసం వెతికారు. ఆగస్టు 20వ తేది ఉదయం, ఒక వ్యవసాయ బావి వద్ద మృతదేహం కనిపించింది.
Also Read
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
అశ్విని శరీరంపై గాయాలు అయ్యాయి, బట్టలు లేని స్థితిలో మృతదేహం కనిపించింది. ఈ ఘటనలో గుండ్యా (22), మహంతేశ్ (22), వీరేశ్ (23), ముండర్గి బసవరాజ్ (సుమారు 45) నిందితులుగా ఉన్నారు. వీరంతా ఇదే గ్రామానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. అశ్వినికి ఈ ఘటనకు సుమారు నెల రోజుల ముందే నిశ్చితార్థం జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!