Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder Case: ఒడిశాలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. బొలాంగీర్ జిల్లాలోని దేవ్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బగ్దా గ్రామంలో 40 ఏళ్ల వ్యక్తిని హత్య చేసి, తలను మొండెం నుంచి వేరు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు శత్రుఘ్న సాహూతో పాటు మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడిని తుసురా పోలీస్ స్టేషన్ పరిధిలోని తెబడముండా గ్రామానికి చెందిన సంతోష్ ఖార్సెల్గా గుర్తించారు.
భోజనానికి పిలిచి దారుణ హత్య:
బొలాంగీర్ ఎస్పీ జీ. అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు శత్రుఘ్న సాహూ ఆగస్టు 18న సంతోష్ను భోజనం చేసేందుకు తన ఇంటికి పిలిచారు. సంతోష్ నిద్రపోయిన తర్వాత సాహూ, అతడి సహచరులు కలిసి అతడిపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం పదునైన ఆయుధంతో సంతోష్ తలను మొండెం నుంచి వేరు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సంతోష్ మృతదేహాన్ని గ్రామం వెలుపలికి తీసుకెళ్లి ఓ చెరువులో పడేశారు. అయితే తెగిపోయిన తలను మాత్రం సాహూ ఇంట్లోని పూజా గదిలో దాచినట్లు పోలీసులు గుర్తించారు. గురువారం స్థానికులు చెరువు వద్ద తల లేని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Also Read
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
చిక్కిన నిందితుడు:
దర్యాప్తులో భాగంగా సంతోష్ చివరిసారిగా శత్రుఘ్న సాహూతో కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సాహూ ఇంటికి వెళ్లి విచారించారు. ఆ సమయంలో సాహూ ఇంట్లో ధ్యానం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత మద్యం సేవించే విషయంలో జరిగిన గొడవ కారణంగానే సంతోష్ను హత్య చేసినట్లు సాహూ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే మరింత లోతుగా విచారించగా.. సంతోష్ తెగిపోయిన తలను పూజా గదిలో దాచినట్లు అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు చూపించిన ప్రదేశంలో పోలీసులు తవ్వకాలు చేపట్టి సంతోష్ తలను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రక్తంతో తడిసిన పదునైన ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రాల కోసమే హత్య?
ఈ హత్య వెనుక మూఢనమ్మకాలు, తంత్ర-మంత్రాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకు దూరమైన భార్యను తిరిగి తన వద్దకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సాహూ ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. సాహూ భార్య గత సుమారు పదేళ్లుగా తన కుమారుడు, కుమార్తెతో కలిసి అతడికి దూరంగా ఉంటోంది. భార్యను తిరిగి తన వద్దకు రప్పించుకోవాలనే నమ్మకంతో సాహూ నరబలికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య పథకాన్ని సాహూ ఒక్కడే రూపొందించాడా? లేక మరికొందరి సహకారం ఉందా? అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. సాహూ తల్లి, సోదరుడు, వదినను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రధాన నిందితుడు విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ అభిలాష్ తెలిపారు. నిందితుడి ఇంటి నుంచి మృతుడి తలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించిన పోలీసులు.. హత్య జరిగిన తీరును తెలుసుకునేందుకు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేపట్టారు.
తాజావార్తలు
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?