karnataka: కొత్త టూరిజం పాలసీ తీసుకొస్తామన్న డీకే.శివకుమార్
- కర్ణాటక పరిశ్రమలోకి కొత్త టూరిజం పాలసీ
- త్వరలో ప్రవేశపెడతామన్న డిప్యూటీ సీఎం డీకే..శివకుమార్
- దక్షిణాది పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక పరిశ్రమలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త టూరిజం పాలసీని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటక టూరిజం శాఖ నిర్వహించిన ‘దక్షిణ్ భారత్ ఉత్సవ్’ కార్యక్రమంలో డీకే.శివకుమార్ మాట్లాడుతూ.. మంచి టూరిజం పాలసీ వల్ల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులను ఆకర్షించగలుగుతామన్నారు. పారిశ్రామికవేత్తలు బాగా పనిచేసినప్పుడు.. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఎక్కువ ఉద్యోగాలు సృష్టించబడతాయని.. అలాగే పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Darshan Custody Extended : కన్నడ నటుడు దర్శన్ కి షాక్, పోలీస్ కస్టడీ పొడిగింపు
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ నుంచి చాలా మంది ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. వారి అనుభవాలను కర్ణాటకలో పంచుకోవాలని అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటకలో 300 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూస్తోందన్నారు. బెంగళూరు ఐటీ రాజధానితో పాటు పర్యాటక కేంద్రంగా కూడా మారుతుందని అన్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: కార్యకర్త కోరిక మేరకు స్టైలిష్ లుక్లో సీఎం చంద్రబాబు
బెంగళూరులో కబ్బన్ పార్క్ మరియు లాల్ బాగ్ సంప్రదాయ పర్యాటక ప్రదేశాలు. కొత్త తరం ప్రజల కోసం కొత్త పర్యాటక ప్రదేశాలను రూపొందించడానికి బెంగళూరులో స్కై డెక్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే 8-10 రోజుల్లో స్కై డెక్ కోసం కొత్త టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారు. డిస్నీల్యాండ్ తరహాలో బృందావన గార్డెన్ను కూడా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇందుకోసం గత బడ్జెట్లో కేటాయింపులు కూడా జరిగాయని గుర్తుచేశారు. జీఎస్టీ కారణంగా పెట్టుబడులు రావడం లేదని, వ్యాపారులు మొగ్గు చూపడం లేదని డీకే.శివకుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Air India: గన్నవరం నుంచి ముంబైకి నూతన విమాన సర్వీస్ ప్రారంభం
తాజావార్తలు
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్కృష్ణారెడ్డి కేసులో సంచలన మలుపు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!