Griha Lakshmi Yojana: మహిళలకు కర్ణాటక సర్కారు రక్షాబంధన్ కానుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Griha Lakshmi Yojana: రక్షా బంధన్ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం మహిళలకు భారీ కానుక అందించింది. కర్ణాటకలోని అక్కాచెల్లెళ్లకు సిద్ధరామయ్య ప్రభుత్వం రక్షాబంధన్ కానుక ఇచ్చింది. కర్ణాటకలోని మైసూర్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్గాంధీ గృహ లక్ష్మి యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కోటి మందికి పైగా మహిళలకు నెలవారీ రూ.2000 భృతిని అందజేస్తామని నేతలు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గృహలక్ష్మి యోజన కార్యక్రమంలో ప్రసంగించారు. ఎన్నికల ముందు ఐదు వాగ్దానాలు చేశామని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఏదైనా చెబితే అది చేసి చూపిస్తుందన్నారు. గృహలక్ష్మి, శక్తి యోజన, గృహజ్యోతి, అన్న భాగ్య, యువ నిధి యోజనలను కాంగ్రెస్ ప్రారంభించిందన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు ఐదు వాగ్దానాలు చేసింది. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతలు ఏదైనా చెబితే అది చేస్తారని మేం చెప్పాం. ఈరోజు మనం ట్యాబ్లో క్లిక్ చేయగానే కోట్లాది మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.2000 జమ అయింది.” అని రాహుల్ పేర్కొన్నారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
Also Read: Raksha Bandhan: సోదరుడికి నిజమైన రక్షాబంధన్ కానుక.. ప్రాణాన్ని కాపాడేందుకు కిడ్నీ!
రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ, ‘ఎన్నికల తర్వాత కర్ణాటకలో మహిళలు బస్సుల్లో ప్రయాణించడానికి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకానికి ‘శక్తి’ అని పేరు పెట్టి దానిని పూర్తి చేశాం.” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఐదు పథకాలు చూడండి అని రాహుల్ అన్నారు. ఒక్కటి తప్ప మిగతావన్నీ మహిళల కోసం, మిగిలిన నాలుగు పథకాలు మహిళల కోసం రూపొందించబడ్డాయన్నారు. దీని వెనుక లోతైన ఆలోచన ఉందన్నారు. తాను భారత్ జోడో యాత్రలో వేలాది మంది మహిళలను కలిశానని రాహుల్ పేర్కొన్నారు. కర్ణాటకలో దాదాపు 600 కిలోమీటర్లు నడిచానన్న రాహుల్ గాంధీ.. తనకు ఓ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. ద్రవ్యోల్బణాన్ని భరించలేకపోతున్నామని వేలాది మంది మహిళలు తనతో చెప్పారని.. కర్ణాటక మహిళలే ఈ రాష్ట్రానికి పునాది అని తనకు అర్థమైందన్నారు.
1.1 కోట్ల మంది మహిళలకు నెలవారీ రూ.2,000 సహాయం అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గృహ లక్ష్మి యోజన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా మొత్తాన్ని బదిలీ చేశారు. అదే సమయంలో, ఈ పథకాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ప్రారంభించారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!