Raksha Bandhan: సోదరుడికి నిజమైన రక్షాబంధన్ కానుక.. ప్రాణాన్ని కాపాడేందుకు కిడ్నీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raksha Bandhan: దేశంలో రక్షాబంధన్ వేడుకల సందడి ప్రారంభమైంది. తోడబుట్టినవారికి జీవితాంతం అండగా ఉంటానని సోదరులు హామీ ఇచ్చే రోజు ఇది. అయితే, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో సోదరుడికి ఓ సోదరి అరుదైన రక్షాబంధన్ కానుక ఇచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన అన్న ప్రాణాన్ని కాపాడేందుకు ఒక కిడ్నీని దానం చేసేందుకు సిద్ధమైంది. కిడ్నీల వైఫల్యంతో బాధపడుతున్న సోదరుడికి తన కిడ్నీని ఇచ్చేందుకు రెడీ అయ్య అందరి ప్రశంసలు అందుకుంటోంది ఆ మహిళ. సోదరుడికి రక్షాబంధన్ కానుక అన్నట్లుగా.. శరీరంలోని ఓ భాగాన్నే దానం చేస్తోంది.
Also Read: China: చైనా మ్యాపులపై భారత్ అభ్యంతరం.. స్పందించిన డ్రాగన్ కంట్రీ..
Also Read
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
- Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఓ మహిళ తన సోదరుడి ప్రాణాలను కాపాడేందుకు తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకుంది. ఓంప్రకాష్ ధంగర్ (48) అనే వ్యక్తి గత ఏడాది మే నుంచి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అతని కిడ్నీలు డయాలసిస్ చేయాల్సిన స్థాయికి క్షీణించాయి. ఒక కిడ్నీ 80 శాతం, మరొకటి 90 శాతం దెబ్బతిన్నాయి. చాలా టెస్టుల తర్వాత అతని కుటుంబం గుజరాత్లోని నాడియాడ్లోని ఆసుపత్రిలో అతనికి కిడ్నీ మార్పిడి చేయాలని నిర్ణయించుకుంది.
కిడ్నీ దాత అవసరమని కుటుంబీకులకు వైద్యులు చెప్పడంతో రాయ్పూర్లోని తిక్రపారా నివాసి ఓంప్రకాష్ అక్క షీలాబాయి పాల్ వెంటనే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆమెకు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఆమె కిడ్నీ సరిగ్గా సరిపోతుందని వైద్యులు వెల్లడించారు. సెప్టెంబర్ 3న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగనుంది. ఓంప్రకాష్, షీలాబాయి ఇద్దరూ ప్రస్తుతం గుజరాత్లో ఉన్నారు. శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నారు.షీలాబాయి తన సోదరుడిని ప్రేమించి, ఆయురారోగ్యాలతో జీవించాలని తమ్ముడి కోసం ఇలా చేస్తున్నానని చెప్పింది. షెడ్యూల్ చేయబడిన కిడ్నీ మార్పిడికి వారం ముందు, షీలాబాయి ఓం ప్రకాష్కు తన భద్రత కోసం ప్రతిజ్ఞగా రాఖీని కట్టింది.
తాజావార్తలు
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
-
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!