Raksha Bandhan: సోదరుడికి నిజమైన రక్షాబంధన్ కానుక.. ప్రాణాన్ని కాపాడేందుకు కిడ్నీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raksha Bandhan: దేశంలో రక్షాబంధన్ వేడుకల సందడి ప్రారంభమైంది. తోడబుట్టినవారికి జీవితాంతం అండగా ఉంటానని సోదరులు హామీ ఇచ్చే రోజు ఇది. అయితే, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో సోదరుడికి ఓ సోదరి అరుదైన రక్షాబంధన్ కానుక ఇచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన అన్న ప్రాణాన్ని కాపాడేందుకు ఒక కిడ్నీని దానం చేసేందుకు సిద్ధమైంది. కిడ్నీల వైఫల్యంతో బాధపడుతున్న సోదరుడికి తన కిడ్నీని ఇచ్చేందుకు రెడీ అయ్య అందరి ప్రశంసలు అందుకుంటోంది ఆ మహిళ. సోదరుడికి రక్షాబంధన్ కానుక అన్నట్లుగా.. శరీరంలోని ఓ భాగాన్నే దానం చేస్తోంది.
Also Read: China: చైనా మ్యాపులపై భారత్ అభ్యంతరం.. స్పందించిన డ్రాగన్ కంట్రీ..
Also Read
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఓ మహిళ తన సోదరుడి ప్రాణాలను కాపాడేందుకు తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకుంది. ఓంప్రకాష్ ధంగర్ (48) అనే వ్యక్తి గత ఏడాది మే నుంచి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అతని కిడ్నీలు డయాలసిస్ చేయాల్సిన స్థాయికి క్షీణించాయి. ఒక కిడ్నీ 80 శాతం, మరొకటి 90 శాతం దెబ్బతిన్నాయి. చాలా టెస్టుల తర్వాత అతని కుటుంబం గుజరాత్లోని నాడియాడ్లోని ఆసుపత్రిలో అతనికి కిడ్నీ మార్పిడి చేయాలని నిర్ణయించుకుంది.
కిడ్నీ దాత అవసరమని కుటుంబీకులకు వైద్యులు చెప్పడంతో రాయ్పూర్లోని తిక్రపారా నివాసి ఓంప్రకాష్ అక్క షీలాబాయి పాల్ వెంటనే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆమెకు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఆమె కిడ్నీ సరిగ్గా సరిపోతుందని వైద్యులు వెల్లడించారు. సెప్టెంబర్ 3న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగనుంది. ఓంప్రకాష్, షీలాబాయి ఇద్దరూ ప్రస్తుతం గుజరాత్లో ఉన్నారు. శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నారు.షీలాబాయి తన సోదరుడిని ప్రేమించి, ఆయురారోగ్యాలతో జీవించాలని తమ్ముడి కోసం ఇలా చేస్తున్నానని చెప్పింది. షెడ్యూల్ చేయబడిన కిడ్నీ మార్పిడికి వారం ముందు, షీలాబాయి ఓం ప్రకాష్కు తన భద్రత కోసం ప్రతిజ్ఞగా రాఖీని కట్టింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!