Raksha Bandhan: సోదరుడికి నిజమైన రక్షాబంధన్ కానుక.. ప్రాణాన్ని కాపాడేందుకు కిడ్నీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raksha Bandhan: దేశంలో రక్షాబంధన్ వేడుకల సందడి ప్రారంభమైంది. తోడబుట్టినవారికి జీవితాంతం అండగా ఉంటానని సోదరులు హామీ ఇచ్చే రోజు ఇది. అయితే, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో సోదరుడికి ఓ సోదరి అరుదైన రక్షాబంధన్ కానుక ఇచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన అన్న ప్రాణాన్ని కాపాడేందుకు ఒక కిడ్నీని దానం చేసేందుకు సిద్ధమైంది. కిడ్నీల వైఫల్యంతో బాధపడుతున్న సోదరుడికి తన కిడ్నీని ఇచ్చేందుకు రెడీ అయ్య అందరి ప్రశంసలు అందుకుంటోంది ఆ మహిళ. సోదరుడికి రక్షాబంధన్ కానుక అన్నట్లుగా.. శరీరంలోని ఓ భాగాన్నే దానం చేస్తోంది.
Also Read: China: చైనా మ్యాపులపై భారత్ అభ్యంతరం.. స్పందించిన డ్రాగన్ కంట్రీ..
Also Read
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఓ మహిళ తన సోదరుడి ప్రాణాలను కాపాడేందుకు తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకుంది. ఓంప్రకాష్ ధంగర్ (48) అనే వ్యక్తి గత ఏడాది మే నుంచి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అతని కిడ్నీలు డయాలసిస్ చేయాల్సిన స్థాయికి క్షీణించాయి. ఒక కిడ్నీ 80 శాతం, మరొకటి 90 శాతం దెబ్బతిన్నాయి. చాలా టెస్టుల తర్వాత అతని కుటుంబం గుజరాత్లోని నాడియాడ్లోని ఆసుపత్రిలో అతనికి కిడ్నీ మార్పిడి చేయాలని నిర్ణయించుకుంది.
కిడ్నీ దాత అవసరమని కుటుంబీకులకు వైద్యులు చెప్పడంతో రాయ్పూర్లోని తిక్రపారా నివాసి ఓంప్రకాష్ అక్క షీలాబాయి పాల్ వెంటనే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆమెకు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఆమె కిడ్నీ సరిగ్గా సరిపోతుందని వైద్యులు వెల్లడించారు. సెప్టెంబర్ 3న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగనుంది. ఓంప్రకాష్, షీలాబాయి ఇద్దరూ ప్రస్తుతం గుజరాత్లో ఉన్నారు. శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నారు.షీలాబాయి తన సోదరుడిని ప్రేమించి, ఆయురారోగ్యాలతో జీవించాలని తమ్ముడి కోసం ఇలా చేస్తున్నానని చెప్పింది. షెడ్యూల్ చేయబడిన కిడ్నీ మార్పిడికి వారం ముందు, షీలాబాయి ఓం ప్రకాష్కు తన భద్రత కోసం ప్రతిజ్ఞగా రాఖీని కట్టింది.
తాజావార్తలు
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!