Siddaramaiah: నేడు తుంగభద్ర డ్యామ్ను పరిశీలించనున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
- వేగంగా సాగుతున్న తుంగభద్ర గేటు మరమ్మతు పనులు
- స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారుల ప్రయత్నాలు
- నేడు తుంగభద్ర డ్యామ్ను పరిశీలించనున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: తుంగభద్ర గేటు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. గల్లంతైన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీరు పూర్తిగా వృథాకాక ముందే స్టాప్లాగ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఏపీ అధికారులు. మొదట డ్యామ్ క్రస్టు స్థాయి 1613 అడుగుల వరకు నీటిని వదిలేసి.. ఆ తర్వాత కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్లాగ్ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం అలా కాకుండా క్రస్టు స్థాయి కన్నా ఎగువకు నీళ్లు ఉన్న సమయంలోనే స్టాప్లాగ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇలా చేస్తే నీటిని పూర్తిగా వృథా కాకుండా చూడొచ్చని అంటున్నారు. ప్రస్తుతం జలాశయంలో 97 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గేటు కొట్టుకుపోయిన సమయం నుంచి సోమవారం రాత్రి 9 గంటల వరకు 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో జలాశయంలోకి సగటున 25, 571 క్యూసెక్కుల నీరు వస్తోంది. 19 గేట్ల నుంచి 99,567 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Read Also: ACB Raids: మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు
Also Read
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
- 144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
నేడు హోస్పేటలో తుంగభద్ర డ్యాంను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పరిశీలించనున్నారు. తుంగభద్ర డ్యామ్ 19 గేటు కొట్టుకుపోవడంతో ఆయన పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 11.50 కి కొప్పలకు కర్ణాటక సీఎం చేరుకోనున్నారు. కొప్పల నుంచి రోడ్డు మార్గంలో 12.15కి తుంగభద్ర ప్రాజెక్టు చేరుకోనున్నారు సీఎం సిద్ధరామయ్య. తుంగభద్ర ప్రాజెక్టును పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో కర్ణాటక సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తుంగభద్ర జలాశయం నుంచి కొప్పలకు రోడ్డు మార్గంలో వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగుళూరు వెళ్లనున్నారు సీఎం సిద్ధరామయ్య. మరో వైపు ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్లు కూడా డ్యామ్ను పరిశీలించనున్నారు. స్థానిక డ్యాం, ఇరిగేషన్ అధికారులతో భేటీ కానున్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
-
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!