Siddaramaiah: నేడు తుంగభద్ర డ్యామ్ను పరిశీలించనున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
- వేగంగా సాగుతున్న తుంగభద్ర గేటు మరమ్మతు పనులు
- స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారుల ప్రయత్నాలు
- నేడు తుంగభద్ర డ్యామ్ను పరిశీలించనున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
Siddaramaiah: తుంగభద్ర గేటు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. గల్లంతైన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీరు పూర్తిగా వృథాకాక ముందే స్టాప్లాగ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఏపీ అధికారులు. మొదట డ్యామ్ క్రస్టు స్థాయి 1613 అడుగుల వరకు నీటిని వదిలేసి.. ఆ తర్వాత కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్లాగ్ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం అలా కాకుండా క్రస్టు స్థాయి కన్నా ఎగువకు నీళ్లు ఉన్న సమయంలోనే స్టాప్లాగ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇలా చేస్తే నీటిని పూర్తిగా వృథా కాకుండా చూడొచ్చని అంటున్నారు. ప్రస్తుతం జలాశయంలో 97 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గేటు కొట్టుకుపోయిన సమయం నుంచి సోమవారం రాత్రి 9 గంటల వరకు 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో జలాశయంలోకి సగటున 25, 571 క్యూసెక్కుల నీరు వస్తోంది. 19 గేట్ల నుంచి 99,567 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Read Also: ACB Raids: మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు
Also Read
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
- TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
- SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
నేడు హోస్పేటలో తుంగభద్ర డ్యాంను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పరిశీలించనున్నారు. తుంగభద్ర డ్యామ్ 19 గేటు కొట్టుకుపోవడంతో ఆయన పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 11.50 కి కొప్పలకు కర్ణాటక సీఎం చేరుకోనున్నారు. కొప్పల నుంచి రోడ్డు మార్గంలో 12.15కి తుంగభద్ర ప్రాజెక్టు చేరుకోనున్నారు సీఎం సిద్ధరామయ్య. తుంగభద్ర ప్రాజెక్టును పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో కర్ణాటక సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తుంగభద్ర జలాశయం నుంచి కొప్పలకు రోడ్డు మార్గంలో వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగుళూరు వెళ్లనున్నారు సీఎం సిద్ధరామయ్య. మరో వైపు ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్లు కూడా డ్యామ్ను పరిశీలించనున్నారు. స్థానిక డ్యాం, ఇరిగేషన్ అధికారులతో భేటీ కానున్నారు.
తాజావార్తలు
-
UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
-
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
-
TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
-
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!