Bribe: లంచం తీసుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు.. ఇంట్లో రూ.6కోట్లు లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka BJP MLA’s Son Caught Taking Bribe: ఒక రోజు క్రితం లంచం తీసుకుంటూ పట్టుబడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత సుమారు రూ. 6 కోట్ల విలువైన నగదు లభించిందని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం ఈ నగదును దాచినట్లు అధికారులు గుర్తించారు. లోకాయుక్త అవినీతి నిరోధక విభాగం, రాష్ట్ర అంబుడ్స్మెన్ బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ ఇంటిపై దాడి చేసి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. దావణగెరె జిల్లాలోని చన్నగిరికి చెందిన ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప, ప్రసిద్ధ మైసూర్ శాండల్ సబ్బును తయారు చేసే ప్రభుత్వ యాజమాన్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కెఎస్డిఎల్)కి చైర్మన్. అతని కుమారుడు బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (BWSSB)లో చీఫ్ అకౌంటెంట్గా ఉన్నారు. కేఎస్డీఎల్ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ను లోకాయుక్త అవినీతి నిరోధక శాఖ నిన్న రూ. 40 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయన కార్యాలయంలో రూ. 1.75 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు కర్ణాటక లోకాయుక్త తెలిపింది. మూడు బ్యాగుల్లోని నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Credit Card Fraud: హైటెక్ మోసం.. ధోనీ, అభిషేక్ బచ్చన్ సహా ప్రముఖుల పాన్ వివరాలతో..
Also Read
- Ram Mandir CEO Vacancy: రామ మందిరం సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటి..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
- Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
2008 బ్యాచ్ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి ప్రశాంత్ మాదాల్, సబ్బు, ఇతర డిటర్జెంట్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల ఒప్పందం కోసం ఒక కాంట్రాక్టర్ నుండి రూ. 81 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో తమకు ఫిర్యాదు అందిందని అంబుడ్స్మన్ తెలిపారు. అంబుడ్స్మన్ స్వతంత్ర దర్యాప్తు జరుపుతారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్పై కూడా విరుచుకుపడ్డారు. ‘అవినీతిని అరికట్టేందుకు లోకాయుక్తను తిరిగి ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ హయాంలో లోకాయుక్త రద్దుతో చాలా కేసులు మూతపడ్డాయి. మూతపడిన కేసులపై విచారణ జరిపిస్తాం. లోకాయుక్త స్వతంత్ర సంస్థ, మా స్టాండ్ స్పష్టంగా ఉంది. స్వతంత్రంగా దర్యాప్తు చేసి అందులో జోక్యం చేసుకోబోం’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్తో నాగ వంశీ చెక్.. ‘లెనిన్’ విషయంలో ఏం జరిగింది?
-
Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
-
Balakrishna – Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్కు మాస్ ట్రీట్!
-
Raaka: ‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?.. మొత్తం బడ్జేట్ తెలిస్తే షేక్ కావాల్సిందే!
-
Ram Mandir CEO Vacancy: రామ మందిరం సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటి..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!