Karnataka: గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ రెండు విక్రయాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కృత్రిమ రంగుల వాడకం ఆరోగ్యానికి హానికరమని తేలిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో కృత్రిమ ఫుడ్ కలర్తో చేసే గోబీ మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించినట్లు తెలిపింది. వీటిల్లో రంగుల కోసం ఉపయోగించే రోడమైన్-బి అనే రసాయనం ఆరోగ్యానికి హానికరమని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండురావు మీడియాతో మాట్లాడారు. కొన్ని ఆహార పదార్థాల తయారీకి హానికరమైన రసాయనాలు ఉపయోగించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆరోగ్య అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పలు ఫుడ్ సెంటర్ల నుంచి 171 నమూనాలను సేకరించారని.. వాటిని పరీక్షించగా 107 పదార్థాల్లో హానికర కృత్రిమ రంగులను ఉపయోగించినట్లు తేలిందని చెప్పారు. వాటిల్లో రోడమైన్-బి, టాట్రజైన్ వంటి రసాయనాలను వినియోగిస్తున్నారని.. ఇవి ఆరోగ్యానికి ముప్పు తీసుకొస్తాయని ఆయన పేర్కొన్నారు.
రసాయనాలతో చేసే కలర్ గోబీ మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సురక్షితం కాని రసాయనాలను ఉపయోగించే ఫుడ్ సెంటర్లపై కూడా అధికారులు కేసు నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధలను పాటించని వారికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు లైసెన్సును రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రంగులు వేయని తెల్లని పీచు మిఠాయి విక్రయాలపై ఎలాంటి నిషేధం లేదని… వాటిని విక్రయాలు చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.
ఇటీవల తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా పీచు మిఠాయిపై నిషేధం విధించారు. అలాగే పలు రాష్ట్రాల్లో కూడా నిషేధం విధించేందుకు ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ఆ దిశగా తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రోడమైన్-బిని దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. కానీ ఫుడ్ కలరింగ్కు మాత్రం ఉపయోగించకూడదు. దీని వల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశముందని ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలిందని అధికారులు తెలిపారు. ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, అల్సర్ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్కు దారితీసే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..