Kargil Vijay Diwas 2023: కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల శౌర్యానికి ప్రతీక.. విజయ్ దివస్
Kargil Vijay Diwas 2023: కార్గిల్ విజయ్ దివస్.. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రతి ఏడాది జులై 26న జరుపుకునే ‘విజయ్ దివస్’.. తీవ్రమైన యుద్ధంలో భారత సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని గౌరవిస్తుంది. పాకిస్థాన్పై విజయవంతమైన ఆపరేషన్కు ‘ఆపరేషన్ విజయ్’ అని పేరు పెట్టారు. ఇదే రోజున రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో భారత ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులర్పిస్తారు. ఇప్పుడు జరుపుకునేది 24వ విజయ్ దివస్.
Also Read: Madras High Court: తల్లిని చూసుకోని కూతురికి ఆస్తిపై హక్కులుండవు..
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
1999లో పాకిస్తాన్ సైనికులు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటి జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత (ప్రస్తుతం లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం) భారత్, పాకిస్తాన్ మధ్య సాయుధ పోరాటం ప్రారంభమైంది. దీనిని కార్గిల్ యుద్ధం అని పిలుస్తారు, ఇది మే నుంచి జూలై 1999 వరకు కొనసాగింది. 24 ఏళ్ల క్రితం ఇదే రోజున పాకిస్థాన్ సైన్యం ఆక్రమించిన కార్గిల్లోని అన్ని భారత పోస్టులను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ యుద్ధంలో సైనికులు చేసిన త్యాగాలకు గుర్తుగా ఏటా జూలై 26ని పాటిస్తున్నారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, మేజర్ రాజేష్ సింగ్ అధికారి, మేజర్ వివేక్ గుప్తా, ఇతరులు దేశం కోసం ప్రాణాలర్పించిన 527 మంది వీర జవాన్లలో ఉన్నారు.
ఈ సైనికుల గౌరవార్థం ఈ రోజున అనేక కార్యక్రమాలు, కవాతులు నిర్వహించబడతాయి. ప్రధాన వేడుక ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద జరుగుతుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లడఖ్లోని కార్గిల్ జిల్లాలోని ద్రాస్లో ఉన్నారు. కార్గిల్లో అమరులైన జవాన్ల స్మారకార్థం యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద మరణించిన జవాన్లకు పూలమాల వేసి నివాళులు అర్పించారు, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ కూడా సైనికుల జ్ఞాపకార్థం పుష్పగుచ్ఛం ఉంచారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్, కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళులర్పిస్తూ కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు.
తాజావార్తలు
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!