Kargil Vijay Diwas 2023: కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల శౌర్యానికి ప్రతీక.. విజయ్ దివస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kargil Vijay Diwas 2023: కార్గిల్ విజయ్ దివస్.. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రతి ఏడాది జులై 26న జరుపుకునే ‘విజయ్ దివస్’.. తీవ్రమైన యుద్ధంలో భారత సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని గౌరవిస్తుంది. పాకిస్థాన్పై విజయవంతమైన ఆపరేషన్కు ‘ఆపరేషన్ విజయ్’ అని పేరు పెట్టారు. ఇదే రోజున రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో భారత ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులర్పిస్తారు. ఇప్పుడు జరుపుకునేది 24వ విజయ్ దివస్.
Also Read: Madras High Court: తల్లిని చూసుకోని కూతురికి ఆస్తిపై హక్కులుండవు..
Also Read
- Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
- SS Rajamouli: "ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది".. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
- 55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
- Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
1999లో పాకిస్తాన్ సైనికులు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటి జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత (ప్రస్తుతం లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం) భారత్, పాకిస్తాన్ మధ్య సాయుధ పోరాటం ప్రారంభమైంది. దీనిని కార్గిల్ యుద్ధం అని పిలుస్తారు, ఇది మే నుంచి జూలై 1999 వరకు కొనసాగింది. 24 ఏళ్ల క్రితం ఇదే రోజున పాకిస్థాన్ సైన్యం ఆక్రమించిన కార్గిల్లోని అన్ని భారత పోస్టులను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ యుద్ధంలో సైనికులు చేసిన త్యాగాలకు గుర్తుగా ఏటా జూలై 26ని పాటిస్తున్నారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, మేజర్ రాజేష్ సింగ్ అధికారి, మేజర్ వివేక్ గుప్తా, ఇతరులు దేశం కోసం ప్రాణాలర్పించిన 527 మంది వీర జవాన్లలో ఉన్నారు.
ఈ సైనికుల గౌరవార్థం ఈ రోజున అనేక కార్యక్రమాలు, కవాతులు నిర్వహించబడతాయి. ప్రధాన వేడుక ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద జరుగుతుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లడఖ్లోని కార్గిల్ జిల్లాలోని ద్రాస్లో ఉన్నారు. కార్గిల్లో అమరులైన జవాన్ల స్మారకార్థం యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద మరణించిన జవాన్లకు పూలమాల వేసి నివాళులు అర్పించారు, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ కూడా సైనికుల జ్ఞాపకార్థం పుష్పగుచ్ఛం ఉంచారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్, కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళులర్పిస్తూ కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు.
తాజావార్తలు
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!