Kargil Vijay Diwas 2023: కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల శౌర్యానికి ప్రతీక.. విజయ్ దివస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kargil Vijay Diwas 2023: కార్గిల్ విజయ్ దివస్.. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రతి ఏడాది జులై 26న జరుపుకునే ‘విజయ్ దివస్’.. తీవ్రమైన యుద్ధంలో భారత సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని గౌరవిస్తుంది. పాకిస్థాన్పై విజయవంతమైన ఆపరేషన్కు ‘ఆపరేషన్ విజయ్’ అని పేరు పెట్టారు. ఇదే రోజున రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో భారత ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులర్పిస్తారు. ఇప్పుడు జరుపుకునేది 24వ విజయ్ దివస్.
Also Read: Madras High Court: తల్లిని చూసుకోని కూతురికి ఆస్తిపై హక్కులుండవు..
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు... వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా... వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
1999లో పాకిస్తాన్ సైనికులు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటి జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత (ప్రస్తుతం లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం) భారత్, పాకిస్తాన్ మధ్య సాయుధ పోరాటం ప్రారంభమైంది. దీనిని కార్గిల్ యుద్ధం అని పిలుస్తారు, ఇది మే నుంచి జూలై 1999 వరకు కొనసాగింది. 24 ఏళ్ల క్రితం ఇదే రోజున పాకిస్థాన్ సైన్యం ఆక్రమించిన కార్గిల్లోని అన్ని భారత పోస్టులను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ యుద్ధంలో సైనికులు చేసిన త్యాగాలకు గుర్తుగా ఏటా జూలై 26ని పాటిస్తున్నారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, మేజర్ రాజేష్ సింగ్ అధికారి, మేజర్ వివేక్ గుప్తా, ఇతరులు దేశం కోసం ప్రాణాలర్పించిన 527 మంది వీర జవాన్లలో ఉన్నారు.
ఈ సైనికుల గౌరవార్థం ఈ రోజున అనేక కార్యక్రమాలు, కవాతులు నిర్వహించబడతాయి. ప్రధాన వేడుక ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద జరుగుతుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లడఖ్లోని కార్గిల్ జిల్లాలోని ద్రాస్లో ఉన్నారు. కార్గిల్లో అమరులైన జవాన్ల స్మారకార్థం యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద మరణించిన జవాన్లకు పూలమాల వేసి నివాళులు అర్పించారు, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ కూడా సైనికుల జ్ఞాపకార్థం పుష్పగుచ్ఛం ఉంచారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్, కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళులర్పిస్తూ కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు.
తాజావార్తలు
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
-
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!