Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kaleshwaram Commission Inquiry Resumes Krmb Meeting On Krishna Water Dispute Today

Kaleswaram Commission: నేడు కృష్ణా జలాల పంపిణీపై కీలక భేటీకానున్న కాళేశ్వరం కమిషన్

Published Date :February 27, 2025 , 10:49 am
By Kothuru Ram Kumar
  • నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభం
  • కృష్ణా జలాల పంపిణీపై సమావేశం కానున్న కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ.
Kaleswaram Commission: నేడు కృష్ణా జలాల పంపిణీపై కీలక భేటీకానున్న కాళేశ్వరం కమిషన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kaleswaram Commission: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభం కానుంది. గతంలో కమిషన్ ఎదుట హాజరైన వ్యక్తుల్లో కొందరిని మళ్లీ విచారణ చేయాలని నిర్ణయించింది. ఈ విచారణలో ముఖ్యంగా అనుమతులు, నిర్మాణ పనుల్లో కీలకంగా వ్యవహరించిన ఇంజినీర్లను ప్రశ్నించనుంది. కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లు, విచారణలో చెప్పిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కమిషన్ భావిస్తోంది. అందువల్ల, నిజమైన అంశాలను వెలికితీయడానికి ఈ దర్యాప్తును మరింతగా క్షుణ్ణంగా నిర్వహించనున్నట్లు సమాచారం.

Read Also: Telugu Language: ప్రయాగ్‌రాజ్‌లో తెలుగు భాషకు గౌరవం

Also Read

  • Stock Market: హార్ముజ్ డెడ్‌లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
  • SRM University Harassment Case: ఎస్ఆర్‌ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఫిర్యాదుతో..
  • Zohran Mamdani-King Charles: కోహినూర్‌ వజ్రం భారత్‌కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్‌‌కు మమ్దానీ విజ్ఞప్తి!
  • Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్‌గా..!

ఇక కృష్ణా జలాల పంపిణీపై నేడు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపిణీపై ఈ భేటీలో చర్చ జరగనుంది. ఏపీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే పలుమార్లు ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ 63 టీఎంసీల నీరు అవసరమని పేర్కొనగా, ఆంధ్రప్రదేశ్ 55 టీఎంసీలు కావాలని అభిప్రాయపడింది. తాజాగా జరిగిన చీఫ్ ఇంజినీర్ల సమావేశంలో ఈ లెక్కలను తేల్చేందుకు చర్చ జరిగింది. ఈ సమావేశం తర్వాత KRMB భేటీకి హాజరుకావాల్సిన ఏపీ ఎన్‌సీ (ENC) గైర్హాజరయ్యారు. దీని కారణంగా తెలంగాణ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. KRMB సమావేశానికి గైర్హాజరవడం ద్వారా ఏపీ మునుపటి ఒప్పందాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలంగాణ ఆరోపించింది.

గత సమావేశంలో 23 టీఎంసీకి ఏపీ అంగీకరించినప్పటికీ, ఇప్పుడు వారి హాజరుకాకపోవడంపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్నటి భేటీని అధికారికంగా మినెట్ చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. మల్యాల, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాంతాలకు నీటి తరలింపును తక్షణమే ఆపాలని తెలంగాణ అధికారుల డిమాండ్ చేశారు. అంతేకాకుండా శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ నీళ్లు వాడరాదని తెలంగాణ అధికారులు హెచ్చరించారు.

Read Also: SLBC Tunnel Accident: ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్.. జీరో పాయింట్ దగ్గరకు చేరుకున్న బృందం

ఇక ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 36.53 టీఎంసీలు నీరు ఉంది. అందులో ఏపీకి అవసరమైన నీరు 10 టీఎంసీలు కాగా.. తెలంగాణకు 13.16 టీఎంసీలు అవసరం. అలాగే నాగార్జునసాగర్‌లో 30.575 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణ 50.10 టీఎంసీలు కోరుతోంది. మొత్తం రెండు జలాశయాల్లో కలిపి అందుబాటులో ఉన్న నీరు 67.093 టీఎంసీలు కాగా.. అయితే, రాష్ట్రాల అవసరాలను చూసినట్లయితే మొత్తం 118 టీఎంసీలు అవసరమవుతున్నాయి. ఈ భేటీలో రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న విభేదాలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ ఈ సమావేశంలో ఒక తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Irrigation Dispute
  • Kaleshwaram commission
  • Krishna Water Dispute
  • KRMB Meeting

తాజావార్తలు

  • Stock Market: హార్ముజ్ డెడ్‌లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు

  • TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు

  • SRM University Harassment Case: ఎస్ఆర్‌ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఫిర్యాదుతో..

  • Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!

ట్రెండింగ్‌

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions