Telugu Language: ప్రయాగ్రాజ్లో తెలుగు భాషకు గౌరవం
- ప్రయాగ్రాజ్లో తెలుగు భాషకు గౌరవం
- రహదారులపై ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు ఆంగ్లం, హిందీతో పాటు తెలుగులో కూడా
- తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో కుంభమేళాకు భక్తులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Language: ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. ఈ మహా కుంభమేళా 144 ఏళ్ల తర్వాత నిర్వహించబడింది. ప్రతి ఏటా జరిగే ఈ పుణ్యస్నానం, భక్తులకు తమ మానసిక, ఆధ్యాత్మిక శుద్ధిని పొందడానికి ఒక గొప్ప అవకాశం. ఈ ఏడాది కుంభమేళాలో కోటి కుప్పల మంది భక్తులు పాల్గొన్నారు. వారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్కి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు ఈ మహా కుంభమేళాలో పాల్గొనడానికి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి కూడా అనేక మంది ఈ పుణ్యస్నానాలలో పాల్గొన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధి నుంచే 60,000 మందికి పైగా భక్తులు ప్రయాగ్రాజ్కి వెళ్లినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
Also Read: SLBC Tunnel Accident: ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్.. జీరో పాయింట్ దగ్గరకు చేరుకున్న బృందం
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది".. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
ఇక, ఈ కుంభమేళా పుణ్యస్నానాలు మాత్రమే కాకుండా, తెలుగువారి కోసం మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ప్రయాగ్రాజ్ చేరడానికి ఉత్తరప్రదేశ్ రహదారులపై ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు ఆంగ్లం, హిందీతో పాటు తెలుగులో కూడా కనిపించడం ఒక ప్రత్యేక లక్షణంగా మారింది. ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల నుండి ప్రయాగ్రాజ్ వెళ్లిన భక్తులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. మొదటిభాగంగా, భక్తులు ఉన్న ప్రాంతాల పైన తెలుగులో కూడ సూచిక బోర్డులు ఉండటం వలన, వారు సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడం సౌకర్యవంతం అవుతోంది.
Also Read: Thandel : బుజ్జితల్లి నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేత్తన్నానే.. కాస్త నవ్వవే..!
నెటిజన్లు ఈ చర్యను చాలా సానుకూలంగా స్వీకరించారు. తెలుగు భాషకు గౌరవాన్ని ఇచ్చిన యూపీ ప్రభుత్వం చర్యను ప్రశంసిస్తూ, “తెలుగులో సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం భాషకున్న గౌరవం” అని అంటున్నారు. కొంతమంది నెటిజన్లు, “తెలుగు భాషకి మీరు ఇచ్చిన గౌరవం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు మించిన గౌరవం” అని అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఇతర పుణ్యక్షేత్రాలకు కూడా తరలిపోతుంటారు. వారణాసి, అయోధ్య వంటి పవిత్ర ప్రదేశాలకు వార్షిక యాత్రలు చేస్తుంటారు. అటువంటి యాత్రలకు వెళ్లే భక్తుల అవసరం కోసం రైల్వే స్టేషన్లలో, పుణ్యక్షేత్ర ప్రాంతాల్లో కూడా తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. మొత్తంగా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఈ నిర్ణయంపై నెటిజన్లు ధన్యవాదాలు చెబుతూ.. “మన తెలుగు భాషకు ఇచ్చిన గౌరవం ఎంతో గొప్పదిగా ఉంది” అని అభిప్రాయపడుతున్నారు. వారణాసిలో కూడా, తెలుగు భాషలో పేర్లు కనిపించడం తెలుగువారి పట్ల ఉన్న అనుబంధాన్ని, మానసిక బంధాన్ని మరింత గాఢం చేస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది”.. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
-
OTT Movie: హత్య కేసును ఛేదించే గొర్రెల మంద.. ఈ సినిమా కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్!
-
BRB : ఏడాది క్రితమే షూటింగ్ మొదలు.. కానీ కేవలం 20 డేస్ షూట్ మాత్రమే కంప్లీట్
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!