Kakatiya Thermal Project : బయట పడుతున్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇంటి దొంగల బండారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జయశంకర్ భూపాలపల్లి కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇంటి దొంగల బండారం భయపడుతోంది. ఇప్పటికే చోరీ కేసులో 13 మంది పైనా కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మరో 11 మంది పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు.. కేటీపీపీలో జరిగిన దొంగతనం ఇంటి దొంగల పనే అని పోలీసులు తేల్చడం సంచలనంగా మారింది. గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 1100వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో మూడు నెలల క్రితం భారీ చోరీ జరిగింది. ప్రాజెక్ట్ స్టోర్ రూమ్ లో కోటి విలువచేసే మెటీరియల్ చోరీకి గురైనట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీనితో గత జూన్ 6న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కేటీపీపీ డీఈ నుండి ఆర్టిజన్ వరకు 60మంది ఉద్యోగులను పలుమార్లు విచారించారు. కేటీపీపీకి సంబంధించిన కొన్ని పరికరాలు చెల్పూర్ లోని కళ్యాణి ఇంజనీరింగ్ వర్క్ షాప్ లో లభ్యం అయ్యాయి.
కేటీపీపీ జరిచిన దొంగతనం పైనా పోలీసు 4 సెక్షన్ లలో కేసునమోదు చేశారు. క్రైమ్ నెంబర్ :-152/2023 ఐపీసీ 120(B),379,409,420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. షాపు యజమానితోపాటు విక్రయించిన అధికారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. షాపు యజమాని ఫోన్ కాల్ డేటా ఆధారంగా మరో 11 మంది ఉద్యోగులపై కేసు అయ్యింది .Ktpp దొంగతనం కేసులో 7 మగ వాళ్లకు ఉండగా 6 మహిళల పైనా కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. మొత్తం 13 మంది పై కేసు కాగా అందులో 7 గురు మగ ఉద్యోగులు ఉండగా మరో 6.గురు మహిళ ఉద్యోగులు ఉన్నారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
మరో వైపు సంబంధం లేని విషయంలో అధికారులపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్ కు తరలించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని కేటిపీపీ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. కేసుకు సంబంధించిన విచారణ పోలీసులతో కాకుండా జెన్కో విజిలెన్స్ అధికారులతో చేయించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. 3 రోజులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులకు అధికారులు సి.ఎల్ అని వేయడం చర్చనీయాంశంగా మారింది..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!