Kakatiya Thermal Project : బయట పడుతున్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇంటి దొంగల బండారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జయశంకర్ భూపాలపల్లి కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇంటి దొంగల బండారం భయపడుతోంది. ఇప్పటికే చోరీ కేసులో 13 మంది పైనా కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మరో 11 మంది పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు.. కేటీపీపీలో జరిగిన దొంగతనం ఇంటి దొంగల పనే అని పోలీసులు తేల్చడం సంచలనంగా మారింది. గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 1100వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో మూడు నెలల క్రితం భారీ చోరీ జరిగింది. ప్రాజెక్ట్ స్టోర్ రూమ్ లో కోటి విలువచేసే మెటీరియల్ చోరీకి గురైనట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీనితో గత జూన్ 6న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కేటీపీపీ డీఈ నుండి ఆర్టిజన్ వరకు 60మంది ఉద్యోగులను పలుమార్లు విచారించారు. కేటీపీపీకి సంబంధించిన కొన్ని పరికరాలు చెల్పూర్ లోని కళ్యాణి ఇంజనీరింగ్ వర్క్ షాప్ లో లభ్యం అయ్యాయి.
కేటీపీపీ జరిచిన దొంగతనం పైనా పోలీసు 4 సెక్షన్ లలో కేసునమోదు చేశారు. క్రైమ్ నెంబర్ :-152/2023 ఐపీసీ 120(B),379,409,420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. షాపు యజమానితోపాటు విక్రయించిన అధికారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. షాపు యజమాని ఫోన్ కాల్ డేటా ఆధారంగా మరో 11 మంది ఉద్యోగులపై కేసు అయ్యింది .Ktpp దొంగతనం కేసులో 7 మగ వాళ్లకు ఉండగా 6 మహిళల పైనా కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. మొత్తం 13 మంది పై కేసు కాగా అందులో 7 గురు మగ ఉద్యోగులు ఉండగా మరో 6.గురు మహిళ ఉద్యోగులు ఉన్నారు.
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
మరో వైపు సంబంధం లేని విషయంలో అధికారులపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్ కు తరలించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని కేటిపీపీ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. కేసుకు సంబంధించిన విచారణ పోలీసులతో కాకుండా జెన్కో విజిలెన్స్ అధికారులతో చేయించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. 3 రోజులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులకు అధికారులు సి.ఎల్ అని వేయడం చర్చనీయాంశంగా మారింది..
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!