Kakarla Suresh: టీడీపీ ప్రభుత్వంలోనే అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరిశ్రమలు రావాలంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. కలిగిరి మండల కేంద్రంలో కాకర్ల సురేష్, మండల కన్వీనర్ బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, వరికుంటపాడు మండలానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు, ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన సుంకర అంజనాద్రి, వెంకటాద్రిల ఆధ్వర్యంలో కలిగిరి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు.. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు కావాలంటే బాబు రావాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తాత్కాలికమేనని, భవిష్యత్తుకు ఉపయోగ పడవు అన్నారు. రాష్ట్రం బాగుపడాలన్న పేద బడుగు బలహీన వర్గాలు స్థిరంగా ఉండాలన్న వారి జీవితాలలో వెలుగులు నిండాలన్న విజన్ ఉన్న నాయకుడు ప్రణాళిక బద్ధంగా ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు కావలసిన ప్రణాళిక చంద్రబాబు వద్ద ఉందన్నారు. తొమ్మిది పర్యాయాలు పోటీ చేసి 16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన అనుభవము ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు కావాలన్నారు.
Also Read
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
Elvish Yadav: మళ్ళీ చిక్కుల్లో బిగ్ బాస్ విన్నర్.. కేసు నమోదు
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే సంక్షేమ అభివృద్ధి పథకాలు రూపకల్పన చేశారు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాటి విలువ పెంచుకుంటూ పోయారే తప్ప వీరు కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఎదిగారంటే అది చంద్రబాబు నాయుడు వల్లేనన్నారు. చదువుకున్న అక్క చెల్లెమ్మల కోసం కలలకు రెక్కలు డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ చేసుకుంటే వారికి ఉపాధి కల్పించడంతోపాటు, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తామన్నారు. గత రెండు సంవత్సరాలుగా కాకర్ల ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశానన్నారు. అధికారం ఉంటే మరెన్నో చేసేందుకు వీలుగా ఉంటుందన్నారు. రాజకీయాలలో కొత్త వరవడి సృష్టిస్తానని తెలిపారు.
రాజకీయాల్లోకి వచ్చేది దోచుకోవడం దాచుకోవడం కోసం కాదని సేవ చేసేందుకేనని రుజువు చేస్తానన్నారు. కనుక అందరూ నన్ను ఆదరించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. అదేవిధంగా నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవా తత్వరుడు అని జిల్లాలో 160 గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఫ్లోరిన్ బారి నుండి కాపాడిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అటువంటి వారిని ఎంపీగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కనుక ఆయనకు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ముందుగా కలిగిరి పట్టణంలో వేంచేసి ఉన్న మాలక్ష్మమ్మ ఆలయంలో కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలిగిరి పట్టణంలోని అభిమానులు నాయకులు కాకర్ల సురేష్ గారిని శాలువాపూలమాలలతో ఘనంగా సన్మానించారు. కలిగిరి ప్రజానీకం అడుగడుగునా కాకర్ల సురేష్ కు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జనసైనికులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?