Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kakarla Suresh Said That Andhra Pradesh Has Developed In All Sectors Under The Tdp Government

Kakarla Suresh: టీడీపీ ప్రభుత్వంలోనే అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి..

Published Date :March 30, 2024 , 10:39 pm
By Rajesh Veeramalla
Kakarla Suresh: టీడీపీ ప్రభుత్వంలోనే అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

పరిశ్రమలు రావాలంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. కలిగిరి మండల కేంద్రంలో కాకర్ల సురేష్, మండల కన్వీనర్ బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, వరికుంటపాడు మండలానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు, ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన సుంకర అంజనాద్రి, వెంకటాద్రిల ఆధ్వర్యంలో కలిగిరి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు.. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు కావాలంటే బాబు రావాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తాత్కాలికమేనని, భవిష్యత్తుకు ఉపయోగ పడవు అన్నారు. రాష్ట్రం బాగుపడాలన్న పేద బడుగు బలహీన వర్గాలు స్థిరంగా ఉండాలన్న వారి జీవితాలలో వెలుగులు నిండాలన్న విజన్ ఉన్న నాయకుడు ప్రణాళిక బద్ధంగా ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు కావలసిన ప్రణాళిక చంద్రబాబు వద్ద ఉందన్నారు. తొమ్మిది పర్యాయాలు పోటీ చేసి 16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన అనుభవము ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు కావాలన్నారు.

Also Read

  • Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
  • YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
  • YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
  • Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

Elvish Yadav: మళ్ళీ చిక్కుల్లో బిగ్ బాస్ విన్నర్.. కేసు నమోదు

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే సంక్షేమ అభివృద్ధి పథకాలు రూపకల్పన చేశారు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాటి విలువ పెంచుకుంటూ పోయారే తప్ప వీరు కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఎదిగారంటే అది చంద్రబాబు నాయుడు వల్లేనన్నారు. చదువుకున్న అక్క చెల్లెమ్మల కోసం కలలకు రెక్కలు డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ చేసుకుంటే వారికి ఉపాధి కల్పించడంతోపాటు, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తామన్నారు. గత రెండు సంవత్సరాలుగా కాకర్ల ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశానన్నారు. అధికారం ఉంటే మరెన్నో చేసేందుకు వీలుగా ఉంటుందన్నారు. రాజకీయాలలో కొత్త వరవడి సృష్టిస్తానని తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చేది దోచుకోవడం దాచుకోవడం కోసం కాదని సేవ చేసేందుకేనని రుజువు చేస్తానన్నారు. కనుక అందరూ నన్ను ఆదరించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. అదేవిధంగా నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవా తత్వరుడు అని జిల్లాలో 160 గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఫ్లోరిన్ బారి నుండి కాపాడిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అటువంటి వారిని ఎంపీగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కనుక ఆయనకు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ముందుగా కలిగిరి పట్టణంలో వేంచేసి ఉన్న మాలక్ష్మమ్మ ఆలయంలో కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలిగిరి పట్టణంలోని అభిమానులు నాయకులు కాకర్ల సురేష్ గారిని శాలువాపూలమాలలతో ఘనంగా సన్మానించారు. కలిగిరి ప్రజానీకం అడుగడుగునా కాకర్ల సురేష్ కు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జనసైనికులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Elections 2024
  • chandrababu
  • Election Campaign
  • Kakarla Suresh
  • tdp

తాజావార్తలు

  • Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌పై.. హైకోర్టు సీరియస్..

  • Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!

  • KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!

  • Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions