Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kakarla Suresh Said That Andhra Pradesh Has Developed In All Sectors Under The Tdp Government

Kakarla Suresh: టీడీపీ ప్రభుత్వంలోనే అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి..

NTV Telugu Twitter
Published Date :March 30, 2024 , 10:39 pm
By Rajesh Veeramalla
Kakarla Suresh: టీడీపీ ప్రభుత్వంలోనే అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

పరిశ్రమలు రావాలంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. కలిగిరి మండల కేంద్రంలో కాకర్ల సురేష్, మండల కన్వీనర్ బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, వరికుంటపాడు మండలానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు, ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన సుంకర అంజనాద్రి, వెంకటాద్రిల ఆధ్వర్యంలో కలిగిరి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు.. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు కావాలంటే బాబు రావాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తాత్కాలికమేనని, భవిష్యత్తుకు ఉపయోగ పడవు అన్నారు. రాష్ట్రం బాగుపడాలన్న పేద బడుగు బలహీన వర్గాలు స్థిరంగా ఉండాలన్న వారి జీవితాలలో వెలుగులు నిండాలన్న విజన్ ఉన్న నాయకుడు ప్రణాళిక బద్ధంగా ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు కావలసిన ప్రణాళిక చంద్రబాబు వద్ద ఉందన్నారు. తొమ్మిది పర్యాయాలు పోటీ చేసి 16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన అనుభవము ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు కావాలన్నారు.

Elvish Yadav: మళ్ళీ చిక్కుల్లో బిగ్ బాస్ విన్నర్.. కేసు నమోదు

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే సంక్షేమ అభివృద్ధి పథకాలు రూపకల్పన చేశారు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాటి విలువ పెంచుకుంటూ పోయారే తప్ప వీరు కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఎదిగారంటే అది చంద్రబాబు నాయుడు వల్లేనన్నారు. చదువుకున్న అక్క చెల్లెమ్మల కోసం కలలకు రెక్కలు డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ చేసుకుంటే వారికి ఉపాధి కల్పించడంతోపాటు, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తామన్నారు. గత రెండు సంవత్సరాలుగా కాకర్ల ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశానన్నారు. అధికారం ఉంటే మరెన్నో చేసేందుకు వీలుగా ఉంటుందన్నారు. రాజకీయాలలో కొత్త వరవడి సృష్టిస్తానని తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చేది దోచుకోవడం దాచుకోవడం కోసం కాదని సేవ చేసేందుకేనని రుజువు చేస్తానన్నారు. కనుక అందరూ నన్ను ఆదరించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. అదేవిధంగా నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవా తత్వరుడు అని జిల్లాలో 160 గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఫ్లోరిన్ బారి నుండి కాపాడిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అటువంటి వారిని ఎంపీగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కనుక ఆయనకు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ముందుగా కలిగిరి పట్టణంలో వేంచేసి ఉన్న మాలక్ష్మమ్మ ఆలయంలో కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలిగిరి పట్టణంలోని అభిమానులు నాయకులు కాకర్ల సురేష్ గారిని శాలువాపూలమాలలతో ఘనంగా సన్మానించారు. కలిగిరి ప్రజానీకం అడుగడుగునా కాకర్ల సురేష్ కు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జనసైనికులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Elections 2024
  • chandrababu
  • Election Campaign
  • Kakarla Suresh
  • tdp

తాజావార్తలు

  • Off The Record: వాణి ఎత్తులు..? దువ్వాడ శ్రీనివాస్‌ పాలిటిక్స్‌కు పూర్తిగా దూరమైనట్టేనా..?

  • Off The Record: జనసేన ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?

  • Off The Record: పీసీసీ చీఫ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల మీటింగ్స్.. దేనికి?

  • Telangana Cabinet: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు!

  • Off The Record: కవితపై కేసీఆర్ ఇంకా సీరియస్‌గానే ఉన్నారా? చూడ్డానికి కూడా ఇషపడట్లేదా..?

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions