Kakani Govardhan : పొదలకూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొదలకూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్ అని, గూడూరులో సభ తర్వాత గంటన్నర సేపు అక్కడే వేచి ఉన్నారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ.. సభ సమయం ప్రకారం 3 గంటలకు 500 మంది కూడా లేరన్నారు. గరిష్టంగా సభకు 15 వందల మంది వచ్చారని, చంద్రబాబు మాట్లాడేటప్పుడు 300 మంది కూడా లేరన్నారు కాకాణి గోవర్థన్ రెడ్డి. మెట్ట ప్రాంతమైన సర్వేపల్లి.కి చంద్రబాబు ఏమీ చేయలేదని, అందుకే ఏమీ చెప్పుకోలేక పోయారని, అందుకే నన్ను.జగన్ ను తిట్టారన్నారు. నా మీద చంద్రబాబు అభియోగాలు చేశారని, ఆ అభియోగాలపై సి.బి.ఐ.విచారణ జరిపించాలని కోర్టు ను కోరేందుకు నేను సిద్ధమన్నారు కాకాణి గోవర్థన్ రెడ్డి. దమ్ముంటే చంద్రబాబు..కూడా తన పై వచ్చిన అభియోగాల పై సీబీఐ విచారణ కోరే ధైర్యం ఉందా అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలకు తెలుసు. సర్వేపల్లి లో చంద్రబాబు కె.జి.ఎఫ్..అన్నారు. సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధి చూపిస్తా రండి. వాటిని చూస్తే కుప్పంలో ఎందుకు ఈ పనులు చేయలేకపోయానని చంద్రబాబు బాధ పడతారు. ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం లేదు. పొదలకూరు సభకు ప్రజలు రాకపోతే నేను ఆపానని చంద్రబాబు ఆరోపించారు. సోమిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లారు. ప్రజలు రాకపోవడంతో అసంతృప్తి లో నన్ను..జగన్ ను తిట్టారు. జగన్ అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతృప్తిగా వున్నారు. వ్యవసాయం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు హయాంలో వర్షాలు కురవలేదు. కానీ బ్రహ్మాండంగా వ్యవసాయం జరిపించానని చెబుతున్నారు.
Also Read
కోర్టు లో ఫైళ్ల చోరీ పై సి.బి.ఐ.క్లీన్ చిట్ ఇచ్చింది. సర్వేపల్లిలో పోటీ చేసేందుకు పలువురిని ప్రయత్నించారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఇటీవల పార్టీలో చేరిన వారిని కూడా అడిగాడు. ఎవరూ రాకపోవడంతో సోమిరెడ్డికి టికెట్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో మార్పులు తీసుకొచ్చాను. సోమిరెడ్డి హయాంలో రైతులను దోచుకున్నారు. రైతు రథం లోకూడా కమిషన్లు కొట్టారు. జగన్ ను విమర్శించే స్థాయి చంద్రబాబుకు లేదు. టికెట్ల కేటాయింపులో జగన్ సామాజిక న్యాయం పాటించారు. వచ్చే ఎన్నికల్లో ఒక స్థానం కూడా టీడీపీ కి రాదు. కానీ చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు నేతలు వై.సి.పి.ని. వీడినా ఇబ్బంది లేదు. సర్వేపల్లి నియోజకవర్గం లో దొరికిన మద్యం పై విచారణ జరుగుతోంది.’ అని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
-
Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!