Kakani Govardhan : పొదలకూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొదలకూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్ అని, గూడూరులో సభ తర్వాత గంటన్నర సేపు అక్కడే వేచి ఉన్నారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ.. సభ సమయం ప్రకారం 3 గంటలకు 500 మంది కూడా లేరన్నారు. గరిష్టంగా సభకు 15 వందల మంది వచ్చారని, చంద్రబాబు మాట్లాడేటప్పుడు 300 మంది కూడా లేరన్నారు కాకాణి గోవర్థన్ రెడ్డి. మెట్ట ప్రాంతమైన సర్వేపల్లి.కి చంద్రబాబు ఏమీ చేయలేదని, అందుకే ఏమీ చెప్పుకోలేక పోయారని, అందుకే నన్ను.జగన్ ను తిట్టారన్నారు. నా మీద చంద్రబాబు అభియోగాలు చేశారని, ఆ అభియోగాలపై సి.బి.ఐ.విచారణ జరిపించాలని కోర్టు ను కోరేందుకు నేను సిద్ధమన్నారు కాకాణి గోవర్థన్ రెడ్డి. దమ్ముంటే చంద్రబాబు..కూడా తన పై వచ్చిన అభియోగాల పై సీబీఐ విచారణ కోరే ధైర్యం ఉందా అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలకు తెలుసు. సర్వేపల్లి లో చంద్రబాబు కె.జి.ఎఫ్..అన్నారు. సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధి చూపిస్తా రండి. వాటిని చూస్తే కుప్పంలో ఎందుకు ఈ పనులు చేయలేకపోయానని చంద్రబాబు బాధ పడతారు. ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం లేదు. పొదలకూరు సభకు ప్రజలు రాకపోతే నేను ఆపానని చంద్రబాబు ఆరోపించారు. సోమిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లారు. ప్రజలు రాకపోవడంతో అసంతృప్తి లో నన్ను..జగన్ ను తిట్టారు. జగన్ అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతృప్తిగా వున్నారు. వ్యవసాయం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు హయాంలో వర్షాలు కురవలేదు. కానీ బ్రహ్మాండంగా వ్యవసాయం జరిపించానని చెబుతున్నారు.
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
కోర్టు లో ఫైళ్ల చోరీ పై సి.బి.ఐ.క్లీన్ చిట్ ఇచ్చింది. సర్వేపల్లిలో పోటీ చేసేందుకు పలువురిని ప్రయత్నించారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఇటీవల పార్టీలో చేరిన వారిని కూడా అడిగాడు. ఎవరూ రాకపోవడంతో సోమిరెడ్డికి టికెట్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో మార్పులు తీసుకొచ్చాను. సోమిరెడ్డి హయాంలో రైతులను దోచుకున్నారు. రైతు రథం లోకూడా కమిషన్లు కొట్టారు. జగన్ ను విమర్శించే స్థాయి చంద్రబాబుకు లేదు. టికెట్ల కేటాయింపులో జగన్ సామాజిక న్యాయం పాటించారు. వచ్చే ఎన్నికల్లో ఒక స్థానం కూడా టీడీపీ కి రాదు. కానీ చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు నేతలు వై.సి.పి.ని. వీడినా ఇబ్బంది లేదు. సర్వేపల్లి నియోజకవర్గం లో దొరికిన మద్యం పై విచారణ జరుగుతోంది.’ అని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!