నేడు తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. జస్టిస్ అలోక్ అరాధేతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించనున్నారు. ఈ ప్రొగ్రాంకు సీఎం కేసీఆర్తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. అయితే, ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడంతో అతని స్థానంలో జస్టిస్ అలోక్ అరాధే తెలంగాణకు వచ్చారు.
Read Also: CJI: సోషల్ మీడియాను దుర్వినియోగం చేయోద్దు: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ఈ మేరకు కొలీజియం సిఫార్సులకు కేంద్ర న్యాయశాఖ గత వారం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ పదవి బాధ్యతలు తీసుకుంటున్నారు. అయితే, మధ్యప్రదేశ్కు చెందిన జస్టిస్ అలోక్ అరాధే 1964, ఏప్రిల్ 14న రాయ్పూర్లో జన్మించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తిచేశాక 1988లో న్యాయవాదిగా పని చేశారు. 2007లో సీనియర్ న్యాయవాదిగా, ఆ తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టులో రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టాలకు సంబంధించిన కేసులు వాదించారు.
Read Also: Punjab: పోలీస్ స్టేషన్లో అవినీతికి వ్యతిరేకంగా రోడ్డుపై అడ్డంగా పడుకున్న హోంగార్డు.. వీడియో వైరల్
అయితే, 2009 డిసెంబర్ 29న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2016, సెప్టెంబర్ 16న జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా కొన్ని రోజులు పని చేశారు. ఇక, 2018, నవంబర్ 17న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ కూడా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేశారు.
Read Also: Madhya Pradesh: మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన కార్మికురాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన 2019 జనవరి 1న జరిగింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు సీజేలుగా పనిచేశారు. గత నాలుగేళ్లలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇక్కడ పనిచేశారు. ఇక, జస్టిస్ అలోక్ అరాధే తెలంగాణ హైకోర్టులో ఆరో సీజేగా వచ్చారు. వీరిలో జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు.