CJI: సోషల్ మీడియాను దుర్వినియోగం చేయోద్దు: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI: అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. ఈ బాధ్యతను యువత తీసుకోవాలన్నారు. వేగంగా జనబాహుళ్యంలోకి చేరేందుకు అవకాశమున్న సామాజిక మాధ్యమాలు, అన్ని రంగాల్లోకి విస్తరించిన కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగాన్ని అరికట్టాలన్నారు. శనివారం జరిగిన ఐఐటీ మద్రాస్ 60వ స్నాతకోత్సవంలో సీజేఐ పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. మానవీయ విలువలు, వ్యక్తిగత గోప్యతలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించాలని సీజేఐ తెలిపారు. ఆధునిక సాంకేతికతను సానుకూలంగా వాడుకునేందుకు వీలుగా రక్షణలు ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. సాంకేతికతతో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ప్రజలు భయపడక ముందే నమ్మకమైన వినియోగాన్ని సులభతరం చేయాలన్నారు. సామాజిక మాధ్యమాల రాకతో సరిహద్దులు, వయస్సు, జాతీయత వంటి అవరోధాలు తొలగినప్పటికీ ఆన్లైన్లో వేధింపులు, ట్రోలింగ్ వంటివి కొత్తగా పుట్టుకొచ్చా యని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమాలు, కృత్రిమ మేధ పద్ధతుల దుర్వినియోగం ఆగాలని సీజేఐ అన్నారు. న్యాయబద్ధత, మానవతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా సాంకేతిక వినియోగం ఉండాలని జస్టిస్ చంద్రచూడ్ ఆకాంక్షించారు. సోషల్ మీడియా వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం అనే భావన పౌరుల్లో నెలకొనకుండా సాంకేతికత వినియోగం జరగాలన్నారు. ఐఐటీ మద్రాస్ ఆరు దశాబ్దాలకు పైగా పరిశోధనలు, నూతన, సాంకేతిక ఆవిష్కరణలతో దేశాభివృద్ధికి నిరంతరం పాటుపడుతుండటం అభినందనీయమని పేర్కొన్నారు. అన్ని రంగాలకు విస్తరించిన సాంకేతికత, కృత్రిమ మేధను దుర్వినియోగం చేయొద్దని.. అన్నింటికంటే మానవ విలువలు సర్వోన్నతమైనవని సీజేఐ అన్నారు. ‘సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఆన్లైన్ వేధింపులకు వేదిక అవుతున్నది. నైతిక విలువలకు ప్రతీకగా నిలిచే టెక్నాలజీ అమలైనప్పుడు ఆ విలువలను మరింత పెంచుతుందని సీజేఐ తెలిపారు.
Read also: Madhya Pradesh: మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన కార్మికురాలు
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా సాంకేతికత దుర్వినియోగాన్ని అరికట్టడం కీలకమైన సవాలు అని డీవై చంద్రచూడ్ హెచ్చరించారు. ఈ కొత్త కమ్యూనికేషన్ సాధనం ఆన్లైన్ దుర్వినియోగం మరియు ట్రోలింగ్ వంటి కొత్త ప్రవర్తనకు దారితీసింది. అదేవిధంగా, AI దుర్వినియోగం, తప్పుదారి పట్టించడం, బెదిరించడం లేదా వ్యక్తులను బెదిరించే అవకాశం కూడా ఉంది. హానికరమైన ప్రయోజనాల కోసం దాని దుర్వినియోగాన్ని అరికట్టడం ప్రధాన సవాళ్లలో ఒకటన్నారు. వాస్తవ ప్రపంచంలో ఏ సాంకేతికత తటస్థంగా ఉండదని పేర్కొన్న జస్టిస్ చంద్రచూడ్, సాంకేతిక వినియోగం కొన్ని మానవ విలువలను నెరవేర్చి, వాటికి ప్రాతినిధ్యం వహించాలన్నారు. విలువలు ముఖ్యమైనవి. విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత మన స్వేచ్ఛ, సమానత్వం మరియు సామాజిక న్యాయాన్ని భద్రపరచడానికి శక్తినిస్తుందని సీజేఐ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సీజేఐ చెబుతూ, కోవిడ్-19 మహమ్మారి సమయంలో, సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా 43 మిలియన్ల వర్చువల్ హియరింగ్లను నిర్వహించిందని, న్యాయవాదులు మరియు న్యాయమూర్తులు కేసుల పరిష్కారానికి కోర్టుల ముందు హాజరు కావడానికి వీలుగా ఇలాంటి వర్చువల్ హియరింగ్లను నిర్వహించారని, తద్వారా “సమిష్టిత మరియు న్యాయం పొందేందుకు” మార్గం సుగమం చేసిందని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. 60వ కాన్వొకేషన్లో మొత్తం 2,571 మంది విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు. 453 మంది డాక్టరేట్ డిగ్రీలు పొందారు, ఇందులో 19 మంది విదేశీ విశ్వవిద్యాలయాలతో ఉమ్మడి డిగ్రీలు పొందారు.
తాజావార్తలు
-
Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
-
Astrology: జూలై 3 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!