Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Dont Misuse Social Media Cji Justice Chandrachud

CJI: సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేయోద్దు: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

Published Date :July 23, 2023 , 8:14 am
By Naga Maneendra
CJI: సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేయోద్దు: సీజేఐ   జస్టిస్‌ చంద్రచూడ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

CJI: అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న సోషల్‌ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ అన్నారు. ఈ బాధ్యతను యువత తీసుకోవాలన్నారు. వేగంగా జనబాహుళ్యంలోకి చేరేందుకు అవకాశమున్న సామాజిక మాధ్యమాలు, అన్ని రంగాల్లోకి విస్తరించిన కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగాన్ని అరికట్టాలన్నారు. శనివారం జరిగిన ఐఐటీ మద్రాస్‌ 60వ స్నాతకోత్సవంలో సీజేఐ పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. మానవీయ విలువలు, వ్యక్తిగత గోప్యతలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించాలని సీజేఐ తెలిపారు. ఆధునిక సాంకేతికతను సానుకూలంగా వాడుకునేందుకు వీలుగా రక్షణలు ఏర్పాటు చేయాలన్నారు. సోషల్‌ మీడియా దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. సాంకేతికతతో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ప్రజలు భయపడక ముందే నమ్మకమైన వినియోగాన్ని సులభతరం చేయాలన్నారు. సామాజిక మాధ్యమాల రాకతో సరిహద్దులు, వయస్సు, జాతీయత వంటి అవరోధాలు తొలగినప్పటికీ ఆన్‌లైన్‌లో వేధింపులు, ట్రోలింగ్‌ వంటివి కొత్తగా పుట్టుకొచ్చా యని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమాలు, కృత్రిమ మేధ పద్ధతుల దుర్వినియోగం ఆగాలని సీజేఐ అన్నారు. న్యాయబద్ధత, మానవతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా సాంకేతిక వినియోగం ఉండాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆకాంక్షించారు. సోషల్‌ మీడియా వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం అనే భావన పౌరుల్లో నెలకొనకుండా సాంకేతికత వినియోగం జరగాలన్నారు. ఐఐటీ మద్రాస్‌ ఆరు దశాబ్దాలకు పైగా పరిశోధనలు, నూతన, సాంకేతిక ఆవిష్కరణలతో దేశాభివృద్ధికి నిరంతరం పాటుపడుతుండటం అభినందనీయమని పేర్కొన్నారు. అన్ని రంగాలకు విస్తరించిన సాంకేతికత, కృత్రిమ మేధను దుర్వినియోగం చేయొద్దని.. అన్నింటికంటే మానవ విలువలు సర్వోన్నతమైనవని సీజేఐ అన్నారు. ‘సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ఆన్‌లైన్‌ వేధింపులకు వేదిక అవుతున్నది. నైతిక విలువలకు ప్రతీకగా నిలిచే టెక్నాలజీ అమలైనప్పుడు ఆ విలువలను మరింత పెంచుతుందని సీజేఐ తెలిపారు.

Read also: Madhya Pradesh: మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన కార్మికురాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా సాంకేతికత దుర్వినియోగాన్ని అరికట్టడం కీలకమైన సవాలు అని డీవై చంద్రచూడ్ హెచ్చరించారు. ఈ కొత్త కమ్యూనికేషన్ సాధనం ఆన్‌లైన్ దుర్వినియోగం మరియు ట్రోలింగ్ వంటి కొత్త ప్రవర్తనకు దారితీసింది. అదేవిధంగా, AI దుర్వినియోగం, తప్పుదారి పట్టించడం, బెదిరించడం లేదా వ్యక్తులను బెదిరించే అవకాశం కూడా ఉంది. హానికరమైన ప్రయోజనాల కోసం దాని దుర్వినియోగాన్ని అరికట్టడం ప్రధాన సవాళ్లలో ఒకటన్నారు. వాస్తవ ప్రపంచంలో ఏ సాంకేతికత తటస్థంగా ఉండదని పేర్కొన్న జస్టిస్ చంద్రచూడ్, సాంకేతిక వినియోగం కొన్ని మానవ విలువలను నెరవేర్చి, వాటికి ప్రాతినిధ్యం వహించాలన్నారు. విలువలు ముఖ్యమైనవి. విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత మన స్వేచ్ఛ, సమానత్వం మరియు సామాజిక న్యాయాన్ని భద్రపరచడానికి శక్తినిస్తుందని సీజేఐ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సీజేఐ చెబుతూ, కోవిడ్-19 మహమ్మారి సమయంలో, సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా 43 మిలియన్ల వర్చువల్ హియరింగ్‌లను నిర్వహించిందని, న్యాయవాదులు మరియు న్యాయమూర్తులు కేసుల పరిష్కారానికి కోర్టుల ముందు హాజరు కావడానికి వీలుగా ఇలాంటి వర్చువల్ హియరింగ్‌లను నిర్వహించారని, తద్వారా “సమిష్టిత మరియు న్యాయం పొందేందుకు” మార్గం సుగమం చేసిందని సీజేఐ చంద్రచూడ్‌ తెలిపారు. 60వ కాన్వొకేషన్‌లో మొత్తం 2,571 మంది విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు. 453 మంది డాక్టరేట్ డిగ్రీలు పొందారు, ఇందులో 19 మంది విదేశీ విశ్వవిద్యాలయాలతో ఉమ్మడి డిగ్రీలు పొందారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CJI
  • IIT Madras
  • justice chandrachud
  • Misuse
  • social media

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions