Julakanti Ranga Reddy : కేసీఆర్ వామపక్షాలను విస్మరించడం సరికాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బీఆర్ఎస్ సోమవారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఎలాంటి లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు 119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థుల పేర్లను ఎన్నికల తేదీకి కనీసం 3 నెలల ముందుగానే ప్రకటించారు. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేల జాబితాలో తొమ్మిది మార్పులు మాత్రమే కనిపించాయి, అందులో రెండు టిక్కెట్లు రాజకీయ బాధ్యతల కారణంగా వారి కుటుంబ సభ్యులకు బదిలీ చేయబడ్డాయి. అవి సికింద్రాబాద్ కంటైన్మెంట్ కాగా మరోటి కోరుట్ల. తొలగించబడిన ఆరుగురు అభ్యర్థులు ఏదో ఒక రూపంలో అధికార వ్యతిరేకత, అనైతిక ప్రవర్తన ఆరోపణలు లేదా కోర్టు కేసును ఎదుర్కొంటున్నారు.
Also Read : Fraud: ఇస్రో రిక్రూట్మెంట్ టెస్ట్లో మోసం.. ఇద్దరు అరెస్ట్
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
ఈ నియోజకవర్గాలు ఉప్పల్, స్టేషన్ ఘన్పూర్, వైరా, ఖానాపూర్, వేములవాడ, బోథ్. అయితే ఇదే సమయంలో పొత్తులపై కూడా సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఎవ్వరితోనీ పొత్తులేకుండానే రానున్న ఎన్నికలకు పోతున్నట్లు వివరించారు. అయితే.. మునుగోడు ఉప ఎన్నికల నుంచి వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న సీఎం కేసీఆర్.. ఆ పొత్తు ఈ ఎన్నికలకు వరకు కూడా కొనసాగిస్తారని సీపీఎం, సీపీఐ నాయకులు భావించారు. కానీ.. వారి ఆశలకు నేటితో తెరలేపారు కేసీఆర్. అయితే.. ఈ నేపథ్యంలోనే.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సీపీఎం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
Also Read : Bandi Sanjay: టీటీడీ ఛైర్మన్ ఎవరండీ..? ఆయనకు ‘పుష్ప’ సినిమా చూపించాలేమో..!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల అవసరం ఉందని కేసీఆర్ వామపక్షాల సహాయం తీసుకున్నారని, అవసరం తీరాక ఇన్నాళ్లు మభ్యపెడుతూ మొండిచేయి చూపించారని సీఎం కేసీఆర్పై ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ వామపక్షాలను విస్మరించడం సరికాదని ఆయన హితవు పలికారు. వామపక్షాలతో కలిసి ఉంటామని చెప్పిన కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం అతని అవకాశవాదానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
కేసీఆర్ చేసిన మోసానికి వామపక్ష పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు నిరుత్సాహ పడొద్దని, అవకాశవాద పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!