Asian Champions Trophy: స్వదేశంలో చైనాను ఓడించి.. ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం
- ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- వరుసగా ఐదో సారి టైటిల్ గెలుచుకున్న భారత్
- చైనాపై 1-0తో గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ ఆతిథ్య చైనా, భారత్ మధ్య జరిగింది. భారత జట్టు ఆరోసారి ఫైనల్ ఆడుతుండగా, చైనాకు ఇది తొలి ఫైనల్. చైనా జట్టు తొలిసారి టైటిల్ను చేజిక్కించుకోవాలని ప్రయత్నించి టీమ్ఇండియాకు గట్టి పోటీనిచ్చింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత హాకీ జట్టు మరోసారి తన సత్తాను చాటుకుంది. భారత హాకీ జట్టు 1-0తో చైనాను ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆసియా ఛాంపియన్షిప్ 2024 ఫైనల్లో, నాల్గవ క్వార్టర్లో మొదటి గోల్ చేయడం ద్వారా భారత హాకీ జట్టు చైనాపై 1-0 ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో క్వార్టర్ 7వ నిమిషంలో జుగ్రాజ్ సింగ్ భారత్ తరఫున ఈ గోల్ చేశాడు. ఈ విధంగా మూడు క్వార్టర్ల తర్వాత ఒక గోల్ చేసి భారత్ ఫైనల్లో ముందంజ వేసింది.
Read Also: Bahirbhoomi: సింగర్ నోయల్ హీరోగా కొత్త సినిమా.. వింత టైటిల్
Also Read
- Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది".. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
ఫైనల్ మ్యాచ్లో భారత్, చైనాల మధ్య మూడు క్వార్టర్ల పాటు టై అయినప్పటికీ, నాలుగో క్వార్టర్ 7వ నిమిషంలో జుగ్రాజ్ సింగ్ అద్భుతమైన పాస్ను గోల్గా మలిచి భారత్కు ఆధిక్యాన్ని అందించాడు. దీని తర్వాత నాలుగో క్వార్టర్ మిగిలి ఉన్న సమయంలో టీమిండియా ఆటగాళ్లు చైనాకు పునరాగమనానికి అవకాశం ఇవ్వలేదు. తద్వారా భారత హాకీ జట్టు ఐదోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. చైనాకు రజత పతకం దక్కనుంది. 2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
భారత్కు ఐదో టైటిల్
ఈ టోర్నీలో భారత జట్టు తన సత్తాను చాటింది. గతంలో భారత్ 2011, 2016, 2018, 2021లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకుంది. ఇప్పుడు 2024లో జరిగిన ఈ టోర్నీని గెలుచుకోవడంలో జట్టు విజయం సాధించింది. అయితే 2016 టోర్నీలో భారత్, పాకిస్థాన్ సంయుక్తంగా గెలిచాయి. ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన రెండో జట్టు పాకిస్థాన్, మూడుసార్లు టైటిల్ గెలుచుకోవడంలో విజయం సాధించింది. ఈసారి పాకిస్థాన్ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. చైనా జట్టు తొలిసారి ఫైనల్ చేరి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!