Jubilee Hills Bypoll: ఒకరిని మించి మరొకరు.. జూబ్లీహిల్స్ బైపోల్లో హద్దు మీరుతున్న నాయకులు!
- పేలుతున్న మాటల తూటాలు
- ఆటంబాంబుల్లా డైలాగ్లు
- ఎన్నికల్లో హీట్ పెంచడానికి రెచ్చిపోతున్న నేతలు
- జూబ్లీహిల్స్ బైపోల్లో హద్దు మీరుతున్న నాయకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాటల తూటాలు పేలుతున్నాయి. డైలాగ్లు ఆటంబాంబుల్లా రీసౌండ్నిస్తున్నాయి. ఎన్నికల్లో హీట్ పెంచడానికి కొందరు నేతలు వాడుతున్న అభ్యంతకర భాష శ్రుతిమించుతోందా?.. జూబ్లీహిల్స్ ఎన్నికలో మూడు పార్టీల పెద్ద నాయకుల లాంగ్వేజ్ హద్దు దాటుతోందా?
జూబ్లీహిల్స్ పోలింగ్ దగ్గరపడేకొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. గల్లీగల్లీ చుట్టేస్తూ..రోడ్ షోలు నిర్వహిస్తూ లీడర్లు డైలాగ్ డోస్ పెంచుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా…లాంగ్వేజ్ని మరో లెవెల్ కి తీసుకెళ్లడమే క్యాంపెయిన్ తీరును మార్చేస్తోంది. ఒకరిని మించి ఒకరు మాటల స్థాయిని దిగజారేస్తున్నారు. ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో ఒకరినొకరు తిట్టుకున్నా….పార్టీ సిద్ధాంతం చుట్టే ప్రసంగాలు తిరిగేవి. ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు వేదికలవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ సొంత సోషల్ మీడియా ఏర్పాటు చేసుకొని ఎవరి బాధను వాళ్లు వినిపించుకోవచ్చు. కానీ వాడుతున్న భాష పట్లనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు.. అన్ని పార్టీల నేతలు దూషణల పర్వాన్ని ఎంచుకుంటున్నారు.
Also Read
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… తాను చెప్పాలనుకున్న అంశాలను చెప్తూనే సీఎం రేవంత్ రెడ్డి పట్ల అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారనేది కాంగ్రెస్ వాదన. ఏక వచనం సంగతి పక్కన పెడితే… లో లెవెల్ డైలాగులు పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఎంని ఉద్దేశించి.. దుర్మార్గుడని.. మగాడివైతే.. లాంటి డైలాగులతో పాటు రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ అబ్జెక్షన్. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునే వరకూ ఈ వ్యవహారం వెళ్ళింది.
బీఆర్ఎస్ నుంచి వస్తున్న డైలాగులకు… సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో సమాధానం ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి కొన్ని రోజులు కొంత సంమయమనం పాటించినా…బీఆర్ఎస్ నుంచి రెచ్చగొట్టే డైలాగులు వస్తున్నాయి అనేది కాంగ్రెస్ వాదన. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా… జూబ్లీహిల్స్ లో చెత్త పేరుకు పోవడానికి ఆ చెత్త నా కొడుకే కారణం కదా అంటూ మాటలు దొర్లాయి. ఇక బిజెపికి సవాల్ విసిరే ప్రయత్నంలో జూబ్లీహిల్స్ లో కింగ్ అయ్యేది తామే అంటూ కిషన్ రెడ్డి కామెంట్లు చేశారు. దానికి బిజెపి కింగ్ కాదు బొంగు కాదు అంటూ సెటైర్లు వేసుకుంటూ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
ఏదేమైనా ఎన్నికల ప్రచారంలో నాయకులు విచ్చలవిడిగా… లోలెవెల్ లాంగ్వేజ్ ని వాడుతున్నారనేది ఓపెన్ టాక్. అది ఎవరు మొదలుపెట్టారు… ఎవరు కొనసాగిస్తున్నారన్న విచక్షణ రాజకీయ నాయకులకే ఉండాలంటున్నారు జనం.
తాజావార్తలు
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!