టాలివుడ్ లో ఒక్క పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తప్ప మిగిలిన వాళ్లంతా కూడా పాన్ ఇండియా స్టార్ హీరోలే.. ఈ హీరోలు కూడా తదుపరి సినిమాలతో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.. స్టార్ హీరోలు సినిమాలతోనే కాదు యాడ్స్ తో కూడా బాగానే సంపాదిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ పెరిగింది.. వరల్డ్ స్టార్ అయ్యాడు.. దాంతో ఈయన్ను వెతుక్కుంటూ ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయి.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు దర్శక నిర్మాతలు ఎన్టీఆర్ డేట్స్ కోసం క్యూ కట్టేస్తున్నారు. ఆ రేంజ్ బ్రాండ్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ ని మన ప్రముఖ కంపెనీలు వాడుకోకుండా ఎందుకు ఉంటాయి?..
ఇప్పటికే పలు బ్రాండ్స్ లలో కనిపిస్తున్న ఎన్టీఆర్.. ఇప్పుడు మెక్ డొనాల్డ్స్ సంస్థ రీసెంట్ గా తమ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్ ని నియమించుకుంది.. రీసెంట్ గా ఈ యాడ్ ప్రసారం అవ్వగా దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 30 సెకండ్స్ నిడివి ఉన్న ఈ యాడ్ కి ఎన్టీఆర్ ఏకంగా 8 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు ఇండస్ట్రీ లో వినిపిస్తున్నాయి.. ఇప్పటివరకు ఎవ్వరు అందుకొని రెమ్యూనరేషన్ ను ఎన్టీఆర్ అందుకున్నారని ఫ్యాన్స్ అంటున్నారు..
స్టార్ హీరోలు ఒక్క సినిమాకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ను ఎన్టీఆర్ కేవలం 30 సెకన్ ల యాడ్ కు తీసుకోవడం మాటలు కాదు.. ఆయన రేంజ్ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.. సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.. ప్రస్తుతం ఈ యాడ్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..