Jogi Ramesh: దాచుకోవడం, దోచుకోవడం చంద్రబాబుకే సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ దావోస్ టూర్పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తుండటాన్ని మంత్రి జోగి రమేష్ ఖండించారు. టీడీపీ విధానాలు చూసి రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి పనికిమాలిన వాళ్లను 14 ఏళ్లు ఎలా భరించామా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారని జోగి రమేష్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రపంచ ఆర్ధిక సదస్సుకు వెళ్లటం నేరమా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యులతో సీఎం జగన్ దావోస్కు వెళ్లడం టీడీపీ వాళ్లకు కడుపు మంటగా ఉందని చురకలు అంటించారు.
Pattabhi: సీబీఐ కోర్టు అనుమతులను జగన్ ఉల్లంఘించారు
Also Read
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
మరోవైపు టీడీపీ నేతలపై వ్యక్తిగతంగా మంత్రి జోగి రమేష్ విమర్శలు చేశారు. యనమల రామకృష్ణుడు ఓ వృద్ధ జంభూకం అని.. పట్టాభి ఓ పంది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అల్జీమర్స్ రోగం ఉందని ఎద్దేవా చేశారు. పట్టాభికి కడుపు మంట రోగం ఉందని.. యనమలకు కడుపు ఉబ్బరం రోగం ఉందని విమర్శలు చేశారు. చంద్రబాబు 38 సార్లు విదేశీ పర్యటనలు చేశాడని.. ఆయన వెళ్తూ దోపిడీ దొంగలను కూడా వెంట తీసుకుని వెళ్లేవాడని జోగి రమేష్ ఆరోపించారు. దేశంలో దోచుకోవడం, దాచుకోవటం, దోపిడీ చేయటం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్నారు. యనమలకు వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఇప్పటికే ఆరు ఒప్పందాలు ప్రభుత్వం చేసుకుందని జోగి రమేష్ వివరించారు
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!