Israel-Iran Tension: ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లతో దాడి.. అండగా నిలిచి అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran Tension: ఇజ్రాయెల్ పై శనివారం నాడు అర్థరాత్రి డ్రోన్లు, మిస్సైళ్లతో ఇరాన్ దాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇజ్రాయెల్కు రక్షణగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని ప్రధాని నెతన్యాహుకు తెలిపాను అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో శత్రువులు తనను ఏమీ చేయలేరన్నారు. మేం ఇజ్రాయెల్కు ఉక్కుకవచంలా ఉండటానికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసేందుకు హెల్ప్ చేశాం.. మా సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారు అని జో బైడెన్ పేర్కొన్నారు.
Read Also: Salaar: మీ ఇంటికే వచ్చేస్తున్న సలార్.. ఎక్కడ చూడొచ్చంటే?
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Rohit - Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్కు అందుబాటులో ఉంటారా?
అయితే, భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తాం అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఈ దాడులను నేను ఖండిస్తున్నాను.. అంతకు ముందే.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో టెలిఫోన్లో మాట్లాడారు. దీంతో పాటు జీ7 దేశాధినేతలతో కూడా జో బైడెన్ ఈ ఘటనపై చర్చించారు. ఇరాన్ దాడిపై సమన్వయంతో దౌత్యమార్గంలో స్పందించే అంశంపై సంభాషించారు. ఇజ్రాయెల్ నేతలతో తన బృందం సభ్యులు టచ్లో ఉందని యూఎస్ అధ్యక్షుడు చెప్పారు. అయితే, ఇరాన్ దాదాపు 200 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ తెలిపింది. వాటిలో కొన్ని మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని చెప్పుకొచ్చింది. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్లోని ఐడీఎఫ్ స్థావరం తీవ్రంగా దెబ్బతినట్లు పేర్కొన్నారు. ఇరాన్ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేయడం ఇదే తొలిసారి అని నెతన్యూహూ ప్రకటించారు.
Read Also: Ram Lalla Silver Coin: రామ్లల్లా వెండి నాణెం విడుదల.. ధర ఎంతో తెలుసా..?
ఇక, ఇరాన్ దాడిపై ఐరాసలో ఆ దేశ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇర్వానీ మాట్లాడుతూ.. అవసరమైన ప్రతిసారి మాకు ఉన్న ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటాం అని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏదైనా సైనిక దుస్సాహసానికి పాల్పడితే ఈ సారి స్పందన మరింత బలంగా ఉంటుంది అని అతడు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!