Jishnu Dev Verma: తెలంగాణ కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం.. ఎవరు ఈ జిష్ణుదేవ్ వర్మ..?
- తెలంగాణ గర్నవర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం..
- రాజ్భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం.. ప్రమాణస్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే..
Jishnu Dev Verma: తెలంగాణ గర్నవర్ గా జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు.. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే.. టీజీ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణస్వీకారం చేయించారు.. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఆ తర్వాత కొత్త గవర్నర్కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు గర్నవర్ జిష్ణుదేవ్ వర్మ.
Read Also: Wayanad Landslide: ప్రకృతి విధ్వంసాన్ని తన కళ్లతో చూసిన వ్యక్తి.. ఏం చెప్పాడంటే..?
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఇకపోతే 1957 ఆగస్టు 15న స్వా తంత్ర దినోత్సవం రోజున జన్మించిన జిష్ణుదేవ్ వర్మ.. 2018 నుండి 2023 వరకూ త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేశారు. అంతేకాకుండా గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన 1990లో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే.. 1993లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. బీజేపీ సీనియర్ నేతగా పార్టీలో పలు పదవుల్లో తనదైన పాత్ర పోషించారు. ఇక అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ రాబాదంతో.. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్, గ్రామీణాభి వృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వహించారు.
Read Also: CM Chandrababu: 5 నూతన పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
2018- 2023 కాలంలో త్రిపురలో 25 ఏళ్ల సుదీర్ఘ సీపీఎం పాలనను కూల్చివేసిన బీజేపీ నేతృత్వంలోని మొదటి ప్రభుత్వంలో జిష్ణు దేవ్ వర్మ డిప్యూటీ సీఎంగా పని చేశారు.. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. తన సొంత నియోజకవర్గం చరిలంలో తిప్రహా ఇండిజినస్ పీపుల్స్ రీజనల్ అలయన్స్ అభ్యర్థి ప్రద్యోత్ కిషోర్ దెబ్బర్మన్ చేతిలో జిష్ణు దేవ్ వర్మ ఓటమిపాలయ్యారు.. పార్టీ, ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. రచయిత కూడా.. “వ్యూస్, రివ్యూస్ అండ్ మై పోయమ్స్” అనే పేరుతో ఓ పుస్తకాన్ని సైతం ప్రచురించారు. ఇక, ఈ నెల 27వ తేదీన జిష్ణు దేవ్ వర్మను తెలంగాణ మూడో గవర్నర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!