Wayanad Landslide: ప్రకృతి విధ్వంసాన్ని తన కళ్లతో చూసిన వ్యక్తి.. ఏం చెప్పాడంటే..?
- వయనాడ్ ప్రమాద ఘటనలో 204కి చేరిన మృతుల సంఖ్య
- అత్యంత వేగంగా కొనసాగుతూన్న రెస్క్యూ ఆపరేషన్
- 31 మంది తమిళనాడు చెందిన వారు మిన్సింగ్
- 1592 మంది కాపాడిన రెస్క్యూ టీం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని వయనాడ్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 204కి చేరింది. అలాగే.. 31 మంది తమిళనాడు చెందిన వారు మిస్సింగ్ కాగా.. 1592 మందిని రెస్క్యూ టీం కాపాడింది. మరోవైపు.. మట్టి కింద మానవ ఉనికిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అత్యంత వేగంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే.. ఈ ప్రకృతి విధ్వంసం జరిగిన సమయంలో ఓ వ్యక్తి తన కళ్లతో చూసిన విషయాలను తెలిపాడు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతమైన చురల్మలలో మంగళవారం రాత్రి 1.30 గంటల సమయంలో పెద్ద శబ్దం విని స్థానిక నివాసి జయన్ నిద్రలేచినట్లు చెప్పాడు. దీంతో.. అతను ఇంటి నుండి బయటకు వచ్చి చూడగా.. ఇంటి లోపల వరద నీరు ప్రవహించడం, ప్రజలు సహాయం కోసం కేకలు వేస్తూ వారి పైకప్పుల వైపు పరుగులు తీయడం చూశాడని తెలిపాడు.
Read Also: BJP: రాహుల్ గాంధీని కులం అడిగితే తప్పేంటి..? ఆయన అదే పనిచేస్తున్నారు కదా..
Also Read
- Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
- Cockroach Janta Party: ఢిల్లీలో "కాక్రోచ్ జనతా పార్టీ" ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
- Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
మంగళవారం ఉదయం జరిగిన భయానక సంఘటనలను గుర్తు చేసుకుంటూ.. ఆ ప్రాంతంలో కరెంటు, వెలుతురు కూడా లేదని జయన్ అన్నారు. వరద నీటికి అవతలి వైపున ఉన్న ప్రజలు సహాయం కోసం కేకలు వేయడం తాను చూశానని.. కాని బురద, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎవరూ వారిని చేరుకోలేకపోయారని అన్నాడు. కూలి పని చేసే జయన్.. అతని కుటుంబం సాధారణంగా రాత్రి 9.30 గంటలకు రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర నుంచి కోలుకునే అవకాశం లేదు. ఆ ప్రాంతంలోని చాలా మంది అలాగే.. రాత్రి 9.30 గంటలకు నిద్ర పోయినట్లు చెప్పాడు. అయితే తర్వాత ఏం జరిగిందో వారందరికీ తెలియదని పేర్కొన్నాడు.
Read Also: Paris Olympics 2024: ఒలింపిక్స్ రౌండప్.. 31/07/2024
రాత్రి 1.30 గంటలకు కొండచరియలు విరిగిపడటం సాధారణమేనని భావించి చురల్మలలో నివసించే అందరూ.. సహాయం కోసం కేకలు వేసి క్షేమంగా ఉంటారనే ఆశతో చాలా మంది నిద్రలోకి జారుకున్నారని జయన్ తెలిపాడు. అయితే తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మళ్లీ పెద్ద శబ్ధం రావడంతో ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. పెద్ద పెద్ద రాళ్లు.. మట్టి ముందు సహాయం కోసం ప్రజలు అరుపులు వేస్తుండటం.. ఇళ్ళన్నీ వరద నీటిలో కొట్టుకుపోవడం.. తమ ముందు బురద, నీరు, చెత్తాచెదారం ప్రవహిస్తున్నందున ఏం చేయాలో తోచలేదన్నాడు. కొద్దిసేపటికే ఆ ప్రాంతంలోని చాలా ఇళ్లు నదిలా మారాయని తెలిపాడు. చుట్టుపక్కల ఎవరూ సజీవంగా ఉన్నట్లు కనిపించలేద్నాడు. మట్టి, రాళ్లతో నిండిన నీటిలో ప్రజలతో పాటు భవనాలు కొట్టుకుపోయాయని.. ఒకప్పుడు పచ్చగా ఉండే ఆ ప్రాంతం ఒక్కసారిగా నదిలా మారి చుట్టూ మట్టిందని ఆ వ్యక్తి తెలిపాడు.
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!