జేఈఈ(మెయిన్) పేపర్-2 ఫలితాలని విడుదల అయ్యాయి. పేపర్ 2-ఏ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించింది కాగా,పేపర్-2 బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకి ఉద్దేశించింది. ఈ పరీక్ష ని ఎన్ టీ ఏ ఫిబ్రవరి 23 వ తేదీ,సెప్టెంబర్ 2 వ తేదీల్లో నిర్వహించింది. రెండు సెషన్స్ కి కలిపి మొత్తం 96,236 మంది రిజిస్టర్ చేసుకోగా 65,015 మంది పరీక్ష రాసారు. పేపర్ 2(బీ) లో మహారాష్ట్ర కి చెందిన జాధవ్ ఆదిత్య సునీల్,కర్ణాటక కి చెందిన ఈశ్వర్ బాలప్ప 100 శాతం స్కోర్ సాధించారు. పేపర్ 2(బి) లో ఆంధ్రప్రదేశ్ లో బండారు రమా సాహిత్య మొదటి ర్యాంక్ సాధించగా తెలంగాణా లో శ్రీ తేజా రెడ్డి పష్య మొదటి ర్యాంక్ సాధించారు.