Crime News: ఎంగిలి గ్లాసులో మద్యం పోస్తారా?.. బర్త్ డే పార్టీలో స్నేహితులను పొడిచిన యువకుడు!
- రఘునాథపల్లి మండలంలో దారుణం
- బర్త్ డే పార్టీలో స్నేహితుల గొడవ
- స్నేహితులపై మరో స్నేహితుడు కత్తితో దాడి
Raghunathpally birthday party stabbing: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీ వేడుకల్లో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఎంగిలి గ్లాసులో తనకు మద్యం పోస్తారా? అంటూ ఇద్దరి స్నేహితులపై మరో స్నేహితుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో కత్తి పోట్లకు గురైన ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న రఘునాథపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. కత్తితో విచక్షణారహితంగా పొడిచిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
మంగళవారం రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంకు చెందిన చెరుకు వెంకటేష్, మల్లా మధుల బర్త్ డే. గ్రామ శివారులోని ఓ ప్రజాప్రతినిధికి చెందిన మామిడి తోటలో బర్త్ డే బాయ్స్ ఇద్దరు కలిసి తమ స్నేహితులకు భారీ ఎత్తున పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి కూరపాటి రాజశేఖర్ కూడా వచ్చాడు. అతడి కూడా స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. కాసేపటికి తనకు ఎంగిలి గ్లాసులో మద్యం పోశారంటూ చెరుకు వెంకటేష్, కీర్తి వెంకటేష్లతో రాజశేఖర్ వాగ్వాదంకు దిగాడు. దీంతో ముగ్గురి మధ్య ఘర్షణ జరిగింది. చెరుకు వెంకటేష్, కీర్తి వెంకటేష్లు తోట నుండి వెల్ది గ్రామానికి చేరుకుని రాజశేఖర్ తండ్రికి గొడవపై ఫిర్యాదు చేశారు.
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
Also Read: Ravi Shastri: ఆల్టైమ్ గ్రేట్ టాప్-5 ఇండియా క్రికెటర్లు.. ద్రవిడ్, గంగూలీ, కుంబ్లేకు నో ప్లేస్!
ఇంట్లో తనపై ఫిర్యాదు చేస్తావా అంటూ కూరపాటి రాజశేఖర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. మద్యం మత్తులో ఉన్న రాజశేఖర్ ముందుగా చెరుకు వెంకటేష్పై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన కీర్తి వెంకేష్ను సైతం గాయపరిచాడు. అక్కడున్న వారు రాజశేఖర్ను అదుపు చేశారు. చెరుకు వెంకటేష్కు తీవ్ర గాయాలు కావడంతో.. హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం అతడు శ్రీకర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కీర్తి వెంకేష్కు జనగామ జిల్లా ఆస్పత్రిలో చికిత్స జరిగింది. చెరుకు వెంకటేష్ పరిస్థితి ఇప్పుడు మెరుగైందని సమాచారం. ప్రస్తుతం రాజశేఖర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?