Janasena Active Membership: క్రియాశీలక సభ్యత్వ నమోదుకు సిద్ధమైన జనసేన.. 10 రోజుల పాటు..
- క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సిద్ధం అవుతోన్న జనసేన..
- ఈ నెల 18 నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం..
- 10 రోజులపాటు నాల్గో విడత సభ్యత్వ నమోదు ప్రక్రియ..
- ఒక్కో నియోజకవర్గంలో 50 మంది వాలంటీర్లతో సభ్యత్వ నమోదు ప్రక్రియ..
- పవన్ కల్యాణ్ ఆశయ సాధనకు అంతా పనిచేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Active Membership: ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ప్రకటించిన పవన్ కల్యాణ్.. అందుకు అనుగుణంగా.. టీడీపీ-జనసేన-బీజేపీ ఒకే వేదికపైకి రావడంలో ఆయన పాత్ర ఎంతో కీలక పాత్ర పోషించారు.. ఆ తర్వాత కూటమి ఘన విజయాన్ని అందుకుంది.. పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాలు, 21 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించి ఊపుమీదున్న జనసేన.. ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సిద్ధం అవుతోంది.. ఈ నెల 18 నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం ఉంటుందని.. 10 రోజులపాటు ఈ నాల్గో విడత సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఆ పార్టీ ప్రకటించింది.. ఒక్కో నియోజకవర్గంలో 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్టు పేర్కొంది.. పవన్ కల్యాణ్ ఆశయ సాధనకు పని చేయాలని జనసేన పిలుపునిచ్చింది. సమష్టిగా పవన్ కల్యాణ్ ఆశయ సాధన కోసం పని చేద్దాం అంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్..
Read Also: Wedding: కూలర్ వివాదం.. పెళ్లికి నిరాకరించిన వధువు.. వరుడి బాధ వైరల్..
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు మనమంతా ఉన్నామనే భరోసాను క్రియాశీలక సభ్యత్వం ఇస్తుందన్నారు నాదెండ్ల.. ఇంతింతై వలుడింతై అన్నట్టుగా జనసేన పార్టీ ముందుకు సాగుతోంది.. గత ఎన్నికల్లో 100 శాతం స్ట్రయిక్ రేటుతో జాతీయ స్థాయిలో చర్చించుకునేలా పార్టీ విజయం సాధించడానికి అంతా సమిష్టిగా కష్టపడ్డాం అన్నారు.. పార్టీ అధినేత పవన్ ఆశయ సాధనకు అంతా కృషి చేయాలన్న ఆయన.. వేయి మంది క్రియాశీలక సభ్యులతో మొదలైన పార్టీ ప్రస్థానం.. నేడు 6.47 లక్షల మందికి చేరింది.. ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న సభ్యత్వ నమోదులో 9 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలనేది లక్ష్యం.. దీనికి అనుగుణంగా పార్టీ నాయకులు, నియోజకవర్గ నేతలు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలి.. జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యే సభ్యులను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.
https://x.com/JanaSenaParty/status/1812120764180787308
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!