Jana Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలను గాలికి వదిలేసాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారంలో వేడిపెరుగుతోంది. ఇప్పటికే మునుగోడులో ఏ వాడ చూసినా ఏదో ఒక పార్టీకి చెందిన నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి రంగంలోకి దిగారు. ఆయన ఆరోజు మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలంలో పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలను గాలికి వదిలేసాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారాన్ని అడ్డుకోవడం సరికాదు.. తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Also Read : Kishan Reddy: సూట్ కేసు నిండా డబ్బులు.. లారీల కొద్దీ బీర్లు
అడ్డుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉప ఎన్నికల సందర్భంగా అనుసరిస్తున్న విధానాలు ఈ సమాజానికి హాని కలిగిస్తాయన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నెలకొన్న తాజా పరిస్థితిలపై ప్రజాస్వామ్యవాదులు నోరుతెరవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓటర్లు నడుము కట్టాల్సిన అవసరం ఉందని, డబ్బు, అధికారంతో వచ్చేవారికి పట్టం కడితే ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
తాజావార్తలు
-
XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!