Jamuna Tudu: ఎవరు ఈ ‘లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియా’? 50 హెక్టార్ల అడవిని ఎలా కాపాడింది!
- ఝార్ఖండ్లోని మాతుకంకి గ్రామానికి చెందిన 'జమున టుడూ'.
- అడవిలో చెట్ల నరికివేతను సహించని జమున.
- "వన సురక్ష సమితి"గా గ్రూప్ ఏర్పాటు.
- అడవిని కాపాడే క్రమంలో నక్సల్స్, మాఫియా లతో బెదిరింపులు.
- పది వేల మందిని ప్రభావితం చేసిన పోరాటం.
- 50 హెక్టార్ల అడవిని కాపాడిన జమున
- 'లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియా'గా బిరుదు.
- పద్మశ్రీ సహా అనేక అవార్డులు కైవసం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jamuna Tudu: ‘జమున టుడూ’ ఒడిశాలోని రాయిరంగపుర్ గ్రామంలో పచ్చదనం, పొలాల మధ్య పెరిగిన ఓ పేదింటి మహిళా. పెళ్ళైన తరువాత, ఆమె తన భర్తతో కలిసి ఝార్ఖండ్లోని మాతుకంకి గ్రామానికి వచ్చింది. అలా వచ్చిన ఆమెకు తన ఇంటి చుట్టూ ఉన్న అనేక చెట్లు నరికిన వాతావరణాన్ని గమనించారు. అవసరాల కోసం స్థానికులు, అలాగే కొందరు తమ స్వార్థం కోసం చెట్లను నరికే స్మగ్లర్లను చూసి ఆమె ఆందోళనకు చెందింది. చెట్లు నరికితే మనకు మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా ఆపద అని గుర్తించి ఆమె అడవి కాపాడాలని బలంగా నిర్ణయించుకుంది.
ఈ అంశానికి సంబంధించి ప్రారంభంలో జమునకు తన కుటుంబ సభ్యుల సహాయం కూడా లభించలేదు. అయినా, ఆమె ఒక మంచి సంకల్పంతో అడవి రక్షణ కోసం పోరాడింది. ఆ సమయంలో ఆమెను అనుసరించిన మహిళలు కూడా చాలా తక్కువే. కానీ, క్రమంగా అయిదుగురు మహిళలు ఆమెకు తోడుగా నిలిచారు. ఆ తర్వాత కొందరితో కలిసి “వన సురక్ష సమితి”గా మారింది. ఈ సమితి సభ్యులు అడవిని కాపాడేందుకు బాణాలు, కర్రలు, కత్తులను చేత బట్టారు.
Also Read
Read Also: IPL 2025 RCB: ‘ఈ సాల కప్ నమ్మదే’.. కొత్త కెప్టెన్ ఆర్సిబి తల రాతను మార్చగలడా!
ఇలా అడవిని కాపాడే క్రమంలో నక్సల్స్, మాఫియా లతో బెదిరింపులు.. ఇతర అడ్డంకులను ఎన్నో ఎదుర్కొంది. ఒకానొక సమయంలో ఆమె చావు అంచుల వరకు కూడా వెళ్లి వచ్చింది. కానీ, ఆమె పోరాటం మాతరం ఆగలేదు. జమున ఈ పోరాటం మొదలు పెట్టే సమయానికి ఈమెకు కేవలం 18 ఏళ్ళు మాత్రమే. నిజానికి జమున సాహసంతో అడవికి రక్షణ దొరికిందని చెప్పవచ్చు.
ఇలా ఈ పోరాటం కేవలం ఆమె ఊరే కాకుండా, పక్క ఊళ్లలో కూడా విస్తరించింది. ఆమె పోరాటం పది వేల మందిని ప్రభావితం చేసిందంటే ఆమె సంకల్పం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 50 హెక్టార్ల అడవిని కాపాడారు. పర్యావరణ రక్షణ కోసం ఆమె చేసిన కృషి, ఆమె ధైర్యం, ఆమె సంకల్పం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రశంసలు పొందాయి. ఆమెకు పద్మశ్రీ సహా అనేక అవార్డులు కూడా దక్కాయి. ఇందులో భాగంగానే జమున టుడూకి ‘లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియా’ అనే బిరుదుని దేశం ఇచ్చింది. ఆమె సాధించిన విజయాలు పర్యావరణ రక్షణకు మాత్రమే కాకుండా.. మహిళల శక్తిని, దృఢ సంకల్పాన్ని చూపించే చిహ్నంగా నిలిచాయి.
తాజావార్తలు
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?