Jaipur: మద్యం మత్తులో లగ్జరీ కారు డ్రైవర్ బీభత్సం.. 16 మందిని ఢీకొట్టిన వైనం.. ఒకరు మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaipur: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోని పాత్రకార్ కాలనీలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఒక లగ్జరీ కారు నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఖరాబాస్ సర్కిల్ వద్ద జరిగింది. ముందుగా రోడ్డు మధ్య డివైడర్ను ఢీకొట్టిన కారు అదుపు తప్పి దాదాపు 30 మీటర్ల దూరం వరకు రోడ్డుపక్కన ఉన్న స్టాళ్లు, ఆహార బండ్లను ఢీకొట్టింది. ఈ క్రమంలో అక్కడ నిలిపి ఉన్న వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
READ MORE: Telangana : పండుగ వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ‘కోటి’ భరోసా..!
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
కారులో నలుగురు ఉన్నారని, వారు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మిగతా వారు పరారయ్యారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారందరినీ మొదట జైపూరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఎనిమిది మందిని అక్కడే చేర్చగా, కొందరిని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. భిల్వారా జిల్లాకు చెందిన రమేష్ బైరవా అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నలుగురిని సవాయి మాన్ సింగ్ (SMS) ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ప్రేమ్చంద్ బైరవా, ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ ఖింసార్ జైపూరియా ఆస్పత్రిని సందర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
READ MORE: Off The Record: మంత్రి పదవి కోసం కోటంరెడ్డి కొత్త డ్రామా మొదలుపెట్టారా?
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!