Myanmar: ఉద్యోగులకు జీతం పెంచిన యజమానికి జైలు శిక్ష..కారణం ఇదే..?
- ఎక్కువ జీతాలు ఇస్తున్న యజమానులను గుర్తించాలని ప్రభుత్వ ఆదేశం
- మయన్మార్ లో ఆర్థిక సంక్షోభం
- ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బు వెళ్లడం వల్లనే ద్రవ్యోల్బణం పెరుగుతోందని భావించిన ప్రభుత్వం
- ఎక్కువ డబ్బులు వస్తే..అవసరానికి మించి వస్తువులు కొంటారని ప్రభుత్వ భావన
- జీతాల పెంపు అశాంతిని రెచ్చగొట్టడం కిందకు వస్తుందని తెలిపిన సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మయన్మార్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది షాపుల యజమానులు తమ ఉద్యోగులకు జీతాలు పెంచడంతో, వారిని జైలుకు పంపారు. ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నారని అలాంటి వారి కోసం వెతకాలని ప్రభుత్వం ఆదేశించింది. బహుశా అక్కడ అలాంటి చట్టం ఉందా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అక్కడ ఇలాంటి చట్టం లేదు. మయన్మార్లో జీతం పెంచడం చట్టవిరుద్ధం కాదు. అయితే ప్రభుత్వం ఇలా ఆందోళన చెందడానికి ఒక కారణం ఉంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మయన్మార్లోని మాండలేలో నివసించే ప్యాయ్ ఫియో జా మూడు దుకాణాల యజమాని. వారు మొబైల్ ఫోన్ వ్యాపారం చేస్తారు. ఈ సంవత్సరం అతను బాగా సంపాదించారు. కాబట్టి అతను తన ఉద్యోగుల జీతాలను పెంచారు. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ మయన్మార్ సైన్యానికి ఇది నచ్చలేదు. వారు వెంటనే ప్యాయ్ ఫియో జావ్ను అరెస్టు చేశారు. వారి దుకాణాలకు కూడా తాళాలు వేశారు. తమ ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు ఆన్లైన్లో వార్తలు వ్యాపించడంతో కనీసం 10 మంది దుకాణదారులు జైలు పాలయ్యారు. ఇది మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షకు దారితీయవచ్చు. జీతం పెరగడంతో చాలా సంతోషించామని, అయితే ఇప్పుడు మా షాప్ మూతపడిందని ప్యా ఫ్యో జా షాప్ ఉద్యోగి తెలిపారు.
Also Read
2021లో సైన్యం అధికారం చేపట్టినప్పటి నుంచి మయన్మార్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశానికి సహాయం చేయడానికి ఏ దేశం సిద్ధంగా లేదు. సైన్యంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సాయుధ దళాలు దేశంలోని సగానికి పైగా ఆక్రమించుకున్నాయి. వారే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వారు అనేక సైనిక స్థావరాలు మరియు పోస్ట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. దీని కారణంగా చైనా, భారత్, థాయ్లాండ్లతో వాణిజ్యానికి అంతరాయం ఏర్పడింది. ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బు వెళ్లడం వల్లనే ద్రవ్యోల్బణం పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. అలా వచ్చిన డబ్బులతో వారు వసరానికి మించి వస్తువులు కొనుగోలు చేయడం ప్రారంభిస్తారని.. అప్పుడు సరుకుల కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని అభిప్రాయపడింది. ప్రజల వద్ద డబ్బు లేకపోతే.. వారు తక్కువ ఖర్చు చేస్తారు. ఇది ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తుంది.
READ MORE:Marri Rajasekhar Reddy: మల్కాజిగిరి ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు..
ఈ కారణంగా.. జీతాల పెంపు అశాంతిని రెచ్చగొట్టడం కిందకు వస్తుందని సైన్యం భావిస్తోంది. ఈ మేరకు ప్యాయ్ ఫియో జాలోని ఒక దుకాణం వెలుపల సైన్యం నోటీసును ఉంచింది. అందులో ‘సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో ఈ దుకాణానికి తాళం వేశారు’ అని రాసి ఉంది. ఇంతకుముందు, బియ్యం, మాంసం మరియు వంట నూనె వంటి ప్రధాన ఆహార పదార్థాలను తక్కువ కొనుగోలు చేయడానికి సైన్యం ఆదేశించింది. బంగారం కొనుగోళ్లు ఆగిపోయాయి. విదేశీ కరెన్సీ కొనుగోలుపై నిషేధం ఉంది. విదేశాలకు డబ్బు పంపడం కూడా నిషేధించబడింది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. బంగారం, విదేశీ కరెన్సీ, విదేశీ స్థిరాస్తులు విక్రయిస్తున్న 35 మందిని అరెస్టు చేశారు. కేవలం రెట్టింపు ధరకు బియ్యాన్ని విక్రయించినందుకు ఏడుగురు ప్రధాన బియ్యం ఉత్పత్తిదారుల అధినేతలతో సహా 11 మందిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!