Jagga Reddy : ఈటల రాజకీయ జీవితం.. రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈటల రాజేందర్ రాజకీయ జీవితం.. రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చరిత్ర.. రాజకీయం మీద బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారని, ఆయన ముందు వీళ్లంతా చిన్న వ్యక్తులు అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులకు స్పష్టంగా చెబుతున్నానని, దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, మోడీ చుట్టే తిరుగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ గురించి కానీ .. మోడీ గురించి చెప్పాల్సిన అవసరం ఉందని, మోడీ ప్రధాని కాకముందు.. అద్వానీ రథయాత్ర ప్రారంభ సమయంలో ఆయన వెనక ఉండి సర్వీస్ చేసే వాడు.. మోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కి మోడీ కి చాలా వ్యత్యాసం ఉందని, అద్వానీ రథయాత్ర కి ముందు దేశానికి .. గుజరాత్ కి మోడీ ఎవరో కూడా తెలియదన్నారు జగ్గారెడ్డి.
అంతేకాకుండా.. ‘అద్వానీ రథయాత్ర పూర్తి అయ్యాక.. గుజరాత్ ఎన్నికలల్లో బీజేపీ ఎమ్మెల్యేగా మోడీ గెలిచిన తర్వాత అద్వానీ సిల్డ్ కవర్ లో సీఎం గా ప్రకటించారు. మోడీ సీల్డ్ కవర్ గుజరాత్ సీఎం. బీజేపీ నేతలు మోడీ సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా.. రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్ లో డిసైడ్ చేశారు.. సీఎం లను డిసైడ్ చేసే రాహుల్ గాంధీ కి.. సీల్డ్ కవర్ సీఎం మోడీ కి చాలా తేడా ఉంది. మోడీ ప్రధాని కాకముందు ఏ పోరాటం చేశారో బీజేపీ నేతలు చెప్పాలి. రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్.. మోడీ పవర్ కోసం వచ్చిన లీడర్. అధికారం లో నుంచి వచ్చిన లీడర్ మోడీ.. ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ. పేదల కోసం రాముడు పాలన చేశారు.. గుడి నిర్మాణం చేస్తే రాముడు సంతోషిస్తా.. అనలేదు రాముడు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
- Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
కిషన్ రెడ్డి.. ఈటెల.. సంజయ్ లు రాజకీయంగా బతకాలి అంటే.. జై శ్రీరామ్ అనకతప్పదు. రామాలయ నిర్మాణం తో సమస్యలు పోయాయా.. శ్రీరామ చంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే. రాముడి ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమే.. సీట్ల కేటాయింపుల తో సమస్యలు పోవు.. కొందరికి సీట్ల విషయంలో అన్యాయం జరగవచ్చు.. కానీ అది ఒక్కరి సమస్య.. అధికారంలో ఎన్ని ఏళ్లు ఉన్నమనేది.. కాదు.. ప్రజలు ఎంత తుప్తి తో జీవిస్తున్నారు అనేది రామ రాజ్యం. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో.. 56 లక్షల కోట్లు అప్పు ఉంటే.. పదేళ్ళలో మోడీ పాలనలో అప్పులు డబుల్ అయ్యాయి.. మోడీ కి రాముడు అప్పులు చేయమని చెప్పాడా.. ఏ గ్రంథంలో అప్పులు చేయమని ఉంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
-
Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
-
Saif Ali Khan: బట్టలు లేకుండా నటించమన్నారు… 20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!