Jagadish Reddy : బండి సంజయ్ అజ్ఞానంతో అబద్దాలు మాట్లాడుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోటార్లకీ మీటర్లు పెడతాం, రావలసిన రుణాలు అందించండని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్, ఉచితాలపై, మోటార్లకు మీటర్లు బిగించే విషయంలో కేంద్రం, బీజేపీ దొంగాట ఆడుంతుందని ఆయన మండిపడ్డారు. మోటార్లకు మీటర్లు పెట్టం అని అసెంబ్లీలోనే చెప్పామని, అబద్దాలు ఆడే నాయకులను అడ్డంపెట్టి అబద్దాలు చెప్పిస్తోంది బీజేపీ అని ఆయన విమర్శించారు. దమ్ముంటే బండి సంజయ్ చెప్పే మాటలను కేంద్ర విద్యుత్ శాఖమంత్రి చెప్పాలని ఆయన అన్నారు.
Also Read : Buggana Rajendranath Reddy: ఐదు లక్షల ఉద్యోగాల కల్పనే టార్గెట్.. 20,000 కొత్త ఎంఎస్ఎంఈలు..
Also Read
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎఫ్ఆర్బీఎం రుణాలు ఎక్కువిస్తామని కేంద్రం చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ‘మోటార్లకు మీటర్లు ఎట్టిపరిస్థితుల్లో పెట్టమని అసెంబ్లీ సాక్షిగా చెప్పాం. అసెంబ్లీలో మేము మాట్లాడింది అబద్ధమైతే బీజేపీ సభ్యులు సభా హక్కుల నోటీస్ ఎందుకు ఇవ్వడంలేదు. బండి సంజయ్ అజ్ఞానంతో అబద్దాలు మాట్లాడుతున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ కోతల పై మాట్లాడని వారు తెలంగాణ పై అవాకులు చెవాకులు పేలుతున్నారు. దుర్మార్గంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విదేశీ బొగ్గు అంటగడుతున్నారు.
Also Read : Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. 35 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
యూనిట్ 50 రూపాయలకు అమ్ముకోమనడం ప్రజల పై కక్ష్య సాధించడమే. యూనిట్ 50 రూపాయలకు అమ్మితే సామాన్యుల పైనే భారం పడుతుంది. ఆదానీకి లాభం చేకూర్చడం కోసమే విదేశీ బొగ్గు నిబంధన తెచ్చారు. విదేశీ బొగ్గు అంటగట్టడం దేశ ద్రోహమే. 3600 రూపాయలకు టన్ను బొగ్గు సింగరేణిలో దొరుకుతుండగా విదేశీ బొగ్గు వల్ల ఎవరికి లాభం ప్రజలు అర్ధం చేసుకోవాలి. మెడ మీద పై కత్తి పెట్టి విదేశీ బొగ్గు అంటగట్టడంలో మతలబు ఏమిటి. మోడీ కి ఆదానికే ఆ మతలబు తెలియాలి. బీజేపీ ఎం చేసినా దేశభక్తి అవుతుందనుకుంటే పొరపాటే. మోటార్లకు మీటర్లు బిగిస్తామని ఎప్పుడూ చెప్పలేదు. అలా చెప్పి ఉంటే తెలంగాణాకు రావలసిన 30 వేల కోట్ల రుణం ఎందుకు ఆపారో బీజేపీ చెప్పాలి. బండి సంజయ్ నిజమైన ఎంపీ అయితే తెలంగాణాకు రావలసిన రుణాల పై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలి. దేశ ప్రజలకు కళ్ళకు గంతల్లీ కట్టి బీజేపీ పాలన సాగిస్తుంది. మోడీ కుట్రలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి దేశ ప్రజలు సరైన సమయంలో బీజేపీకి బుద్ధి చెబుతారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
-
Shahrukh Khan: చరిత్ర సృష్టించిన ‘షారుఖ్’ నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?