ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్లో అగ్రస్థానంలో ఈ రాష్ట్రాలు.. మొత్తంలో సగం వాటా వీటిదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ITR Filing: దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి గడువు 31 జూలై 2023 వరకు నిర్ణయించారు. ఈ సంవత్సరం కూడా కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు తమ పన్నులను జూలై చివరి రోజు వరకు చెల్లించారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలులో ముందంజలో ఉన్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ 5 రాష్ట్రాలు పన్ను చెల్లింపులో ముందంజలో ఉన్నాయి. 2023 అసెస్మెంట్ సంవత్సరంలో దాఖలు చేసిన మొత్తం ఆదాయపు పన్ను రిటర్న్లలో ఈ రాష్ట్రాల వాటా 48 శాతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో ఈ సమాచారం అందించబడింది. దేశంలో తక్కువ ఆదాయ వర్గం నుంచి ఎగువ ఆదాయ వర్గానికి మారిన పన్ను చెల్లింపుదారులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు.
Read Also:IND vs IRE: ఐర్లాండ్తో తొలి టీ20.. శాంసన్ స్థానంలో సిక్సర్ల కింగ్! భారత తుది జట్టు ఇదే
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
అసెస్మెంట్ సంవత్సరం 2022తో పోలిస్తే 2023 అసెస్మెంట్ సంవత్సరంలో 64 లక్షల ఎక్కువ ఐటీఆర్లు దాఖలు చేయబడ్డాయి. దీని కింద మహారాష్ట్రలో అత్యధికంగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. దీని తర్వాత వరుసగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ పేర్లు ఉన్నాయి. వృద్ధి పరంగా మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాలు గత 9 సంవత్సరాలలో ఐటీఆర్ ఫైలింగ్లో 20 శాతం పెరుగుదల నమోదు చేశాయి. 2047 నాటికి మధ్యతరగతి వార్షిక ఆదాయం రూ.50 లక్షలకు చేరుతుందని ఎస్బీఐ నివేదికలో వెల్లడైంది. దేశంలో ఐటిఆర్ ఫైలింగ్లో అభివృద్ధి చెందుతున్న ట్రెండ్లు, మార్పులకు సంబంధించి ‘డిసిఫరింగ్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఐటిఆర్ ఫైలింగ్’ పేరుతో ఎస్బిఐ ఈ నివేదికను తీసుకువచ్చింది. ఇది భారతదేశ పన్ను వ్యవస్థలో నిరంతర మార్పుల గురించి పరిశోధనలను కూడా పేర్కొంది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి రికార్డు స్థాయిలో 6.77 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలయ్యాయి. జూలై 31, 2023 నాటికి 53.67 లక్షల మంది మొదటిసారిగా ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేశారని ఆదాయపు పన్ను శాఖ తెలియజేసింది.
Read Also:Manipur Violence Cases: 53 మందితో సీబీఐ దర్యాప్తు బృందం.. 29 మంది మహిళా అధికారులు
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!