IND vs IRE: ఐర్లాండ్తో తొలి టీ20.. శాంసన్ స్థానంలో సిక్సర్ల కింగ్! భారత తుది జట్టు ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Playing XI vs IRE for 1st T20I 2023: ఐర్లాండ్తో టీ20 సిరీస్కు భారత్ సిద్ధమవుతోంది. సీనియర్ ప్లేయర్స్ లేకుండానే శుక్రవారం (ఆగష్టు 18) ఆరంభమయ్యే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఐర్లాండ్తో తలపడనుంది. ఈ సిరీస్ కోసం జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరింది. భారత జట్టులోని చాలా మంది కొత్త ఆటగాళ్లే. దాదాపుగా ఈ ప్లేయర్స్ వచ్చే నెల ఆరంభమయ్యే ఆసియా క్రీడలు 2023 తలపడే జట్టులోనూ ఉండనున్నారు. దాంతో ఐర్లాండ్తో మొదటి మ్యాచ్కు జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి టీ20 శుక్రవారం రాత్రి 7.30కు డబ్లిన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరు ధాటిగా పరుగులు చేస్తారన్న విషయం తెలిసిందే. మూడో స్థానంలో విండీస్ టీ20 సిరీస్లో అదరగొట్టిన తిలక్ వర్మ ఆడనున్నాడు. నాలుగో స్థానంలో ఆల్రౌండర్ శివమ్ దుబే ఆడతాడు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్ తరపున దుబే ఆడనున్నాడు.
Also Read
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
ఇక ఐదో స్థానంలో సంజు శాంసన్కు బదులుగా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జితేశ్ శర్మ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వెస్టిండీస్పై శాంసన్ వరుసగా 12, 7, 13 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్ల వెనుక కూడా పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్తో సిరీస్లో జితేశ్ను ఆడించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ తరపున జితేశ్ ఆకట్టుకున్నాడు. ఆసియా క్రీడల్లో జితేశ్ను ఆడించేందుకు మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. అతనికి అంతర్జాతీయ అనుభవం కోసం ఐర్లాండ్పై ఆడించొచ్చు.
యువ క్రికెటర్ రింకూ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆరో స్థానంలో అతడు బరిలోకి దిగుతాడు. ఐపీఎల్ 2023లో రింకూ 450 రన్స్ చేశాడు. 7, 8 స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ కోటాలో అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రాలు ఉంటారు. ఒకవేళ సంజూ శాంసన్కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే.. రింకు సింగ్, జితేశ్ శర్మలో ఒకరు బెంచ్కే పరిమితమవుతారు. చూడాలి మరి మేనేజ్మెంట్ ఎవరివైపు మొగ్గు చూపిస్తుందో.
భారత తుది జట్టు (అంచనా):
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివం దూబే, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా.
తాజావార్తలు
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్రూమ్కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్సెట్పై ఉద్యోగి ఆవేదన
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!